E-Paper
Advertisement

Fire Accident: ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు.. 8 మందికి తీవ్రగాయాలు

Fire Accident: ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు.. 8 మందికి తీవ్రగాయాలు
Advertisement

Fire Accident: యాదాద్రి జిల్లా పెద్ద కందుకూరులో భారీ పేలుడు సంభవించింది. ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో రియాక్టర్‌ పేలడంతో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. భయంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. భారీ శబ్దంతో రియాక్టర్‌ పేలడంతో ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి జిల్లా యాదిగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులో భారీపేలుడు సంభవించింది. ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో రియాక్టర్ పేలడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్రగాయాలు కాగా.. వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఎమర్జెన్సీ సైరన్ ఇవ్వడంతో వెంటనే అక్కడి నుంచి కార్మికులు బయటకు పరుగులు తీశారు.

Advertisement

Also Read: కులగణన సర్వేలో సంచలన విషయాలు.. క్రెడిట్ రేవంత్ సర్కార్‌దే

సాధారణంగా ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో పేలుడు పదార్దాలు తయారు చేస్తూ ఉంటారు. నివారణ చర్యలు తీసుకోకపోవడం వల్లనే.. పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అయితే గతంలో కూడా రెండు సార్లు ఇదే విధంగా పేలుడు సంభవించింది. అనేక మంది కార్మికులు గాయపడిన కూడా కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. కార్మికుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరో వైపు ఈ పేలుడు ఎలా జరిగింది అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

 

Related News

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Big Stories

Advertisement
×