E-Paper
Advertisement

Formula E Race case update: ఫార్ములా ఈ రేసు కేసు.. మరోసారి సీఈఓకు పిలుపు

Formula E Race case update: ఫార్ములా ఈ రేసు కేసు.. మరోసారి సీఈఓకు పిలుపు
Advertisement

Formula E Race case update: ఫార్ములా ఈ రేసు కేసు విచారణ ఎంతవరకు వచ్చింది? మూడు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా మారిందా? ఈ కేసులో మళ్లీ కదలిక మొదలైందా? ఎఫ్ఈఓ కంపెనీ సీఈఓ ను మరోసారి విచారించనుందా? ఈయన విచారణతో కేసు ముగింపుకు వస్తుందా? లేక ఎవరైనా ఉన్నారా ఇదే ప్రశ్న చాలామందిని వెంటాడుతున్నాయి.

ఫార్ములా ఈ రేసు కేసు విచారణకు వేగంగా ఫుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు సేకరించిన వివరాలను క్రోడీకరించారు. అయితే కొన్ని విషయాలు అలాగే ఉండిపోవడంతో మళ్లీ అటువైపు దృష్టిపెట్టింది ఏసీబీ. ఈ క్రమలో ఎఫ్ఈవో కంపెనీ సీఈఓను మరోసారి విచారిస్తోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన లండన్ నుంచి విచారణకు హాజరైనట్టు సమాచారం.

Advertisement

కీలక సమాచారం వస్తే వేగంగా ముగింపు ఇవ్వాలన్నది ఏసీబీ ఆలోచనగా తెలుస్తోంది. తెలంగాణ మున్సిపల్‌ శాఖ-ఫార్ములా ఈ ఆపరేషన్స్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఈవో)ల మధ్య జరిగిన ఒప్పందాలపై ప్రశ్నించనుంది. అందులో ఉల్లంఘనలపై ఏసీబీ ఫోకస్ చేసింది. గత నెలలో వర్చువల్‌గా ఎఫ్‌ఈవో సీఈఓ ఆల్బర్టో హాజరయ్యారు. సీజన్-9 చెల్లింపులు , లెటర్ ఆఫ్ ఇంటెంట్, లాంగ్ ఫార్మ్ అగ్రిమెంట్ లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలపై దృష్టి పెట్టిందట ఏసీబీ.

ఫార్ములా ఈ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ రిటైర్డ్ చీఫ్ ఇంజీర్ బీఎల్ఎన్‌రెడ్డిలను పలుమార్లు విచారించింది ఏసీబీ. ఆ తర్వాత నెక్ట్స్ జెన్ కంపెనీ ప్రతినిధులను సైతం విచారించింది. అలాగే ఎలక్టోరల్ బాండ్స్ గురించి గ్రీన్ కో సంస్థ నుంచి సమాచారాన్ని రాబట్టింది.

Advertisement

ALSO READ: మాజీ మంత్రి హరీష్‌రావుపై మరో కేసు

ప్రస్తుతం ఎఫ్‌ఈవో సీఈవోను విచారిస్తున్నారు అధికారులు. దీంతో విచారణ పూర్తి అయినట్టేనా? క్రాస్ చెక్కింగ్ కోసం మరోసారి మిగతా వాళ్లని పిలుస్తారా అనేది తెలియాల్సింది. మరోవైపు ఇదే కేసు దర్యాప్తు చేస్తోంది ఈడీ. ఈ వ్యవహారంలో కీలకమైన వారిని మాత్రమే విచారించింది. ఆ తర్వాత ఈడీ నుంచి ఎలాంటి కదలిక రాలేదు.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×