E-Paper
Advertisement

ఎవరి ఆదేశాలతో ఆపుతున్నారు? పెద్దపల్లి కలెక్టర్‌పై ఎంపీ గడ్డం వంశీ ఫైర్!

ఎవరి ఆదేశాలతో ఆపుతున్నారు? పెద్దపల్లి కలెక్టర్‌పై ఎంపీ గడ్డం వంశీ ఫైర్!
Advertisement

Gaddam Vamsikrishna: పెద్దపల్లి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పనితీరుపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐబీ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధాన్యం సేకరణ విషయంలో రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా నుంచి వస్తున్న వడ్లను మిల్లర్లు తీసుకోవడం లేదని, దీనికి కలెక్టర్ తీరే కారణమని ఆయన మండిపడ్డారు.

జిల్లాలో దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిల్వ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ, కేవలం 2 లక్షల మెట్రిక్ టన్నుల వరకే ఎందుకు తీసుకుంటున్నారని ఎంపీ ప్రశ్నించారు. మిగిలిన ధాన్యం సేకరణలో జాప్యం వెనుక ఎవరి ఆదేశాలైనా ఉన్నాయా అని నిలదీశారు. మంచిర్యాల జిల్లాలో ఎక్కువ శాతం దళిత రైతులు ధాన్యం పండిస్తారని, కావాలనే వారిని ఇబ్బంది పెడుతున్నారా అనే అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు.

Advertisement

అధికారులు రాజకీయాలకు అతీతంగా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని వంశీకృష్ణ సూచించారు. కలెక్టర్‌పై తనకు వ్యక్తిగత కక్షలేవీ లేవని, కేవలం ప్రజా సమస్యల పరిష్కారం కోసమే తాను ప్రశ్నిస్తున్నానని స్పష్టం చేశారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబడి ఎవరినైనా ప్రశ్నిస్తానని, రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.

Also Read: భగ్గుమంటున్న భానుడు.. రాష్ట్ర ప్రజలకు మంత్రి పొంగులేటి కీలక సూచనలు!

Related News

ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతులకు.. తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్..!

కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనపై కేటీఆర్ విసుర్లు, జెన్ జీ పేరు ప్రస్తావిస్తూ, ట్రోల్ చేయకుండా

తెలంగాణలో 1000 రోజుల పాలన.. సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ పోస్ట్, ప్రయాణంలో తోడుగా నిలిచిన..

తెలంగాణ రాజకీయాల్లో డిజిటల్ వార్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐ పోస్టర్లు, ఇవే రాజకీయాలంటూ ప్రజల చర్చ

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

Big Stories

Advertisement
×