E-Paper
Advertisement

RV Karnan: ప్రజావాణి ఆర్జీల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలి.. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్. వి. కర్ణన్ ఆదేశం

RV Karnan: ప్రజావాణి ఆర్జీల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలి..  జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్. వి. కర్ణన్ ఆదేశం

RV Karnan:  ప్రజావాణిలో వచ్చిన ఆర్జీల పరిష్కారానికి అత్యధికంగా ప్రాధాన్యతనివ్వాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు.  జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ కర్ణన్ , అదనపు కమిషనర్లు, విభాగాల ఉన్నతాధికారులతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 46 ఆర్జీలు వచ్చినట్లు, ఆరు జోన్ల కు సంబంధించి మొత్తం 70 ఫిర్యాదులు, వినతులు పౌరుల నుంచి అందినట్లు అధికారులు వెల్లడించారు. ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులకు కమిషనర్
ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ కర్ణన్ మాట్లాడుతూ ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని, విభాగాల వారీగా వచ్చిన ఫిర్యాదులు, వినతులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ ప్రజావాణిలో అదనపు కమిషనర్లు రవి కిరణ్, సత్యనారాయణ, విజిలెన్స్ ఏఎస్పీ నరసింహ రెడ్డి, సీసీపీ శ్రీనివాస్ , చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.

Also ReadHYDRA Warns: హైదరాబాద్‌లో స్థలం లేదా ఫ్లాట్ కొంటున్నారా? హైడ్రా కీలక సూచనలు!

ప్రజా సమస్యలు విన్న ఎంఎంసీ కమిషనర్

మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ టి. వినయ్ కృష్ణ రెడ్డి ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు, వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత విభాగాల అధికారులు కూడా పాల్గొని సమస్యలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 22 వినతిపత్రాలు అందగా, వాటిని సంబంధిత విభాగాలకు పంపించి తక్షణ పరిష్కారం కోసం కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మున్సిపల్ కార్పొరేషన్ కట్టుబడి ఉందని, వాటి పరిష్కారం వరకు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని కమిషనర్ తెలిపారు. ప్రజావాణిలో అందిన మొత్తం ఫిర్యాదుల్లో ఇంజినీరింగ్ విభాగానికి చెందినవి 4, ఫైనాన్స్ విభాగం 1, రెవెన్యూ విభాగం 2, టౌన్ ప్లానింగ్ విభాగం 10, శానిటేషన్ విభాగం 1, ఐటీ విభాగం 1, యూబీడీ విభాగం 1, యూసీడీ విభాగం 1, విజిలెన్స్ విభాగానికి చెందిన మరో ఫిర్యాదు అందినట్లు, వీటిని పరిష్కరించేందుకు తాము కట్టుబడి ఉన్నామని కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి స్పష్టం చేశారు.

Also Read: Vemula Prashanth Reddy: మహిళలకు రూ. 2500 ఎక్కడ? రూ. 4000 పెన్షన్ పెంపు ఏమైంది? : మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

Related News

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Big Stories

×