E-Paper
Advertisement

తెలంగాణలో కీలక పరిణామం.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా.. కోదండరాం, మంత్రి అజారుద్దీన్!

తెలంగాణలో కీలక పరిణామం.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా.. కోదండరాం, మంత్రి అజారుద్దీన్!

MLC Approval: తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం శనివారం చోటుచేసుకుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లను తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదించారు. వీరి అభ్యర్థిత్వాలకు సంబంధించిన ఫైల్స్ పై ఆయన సంతకం చేశారు. దీంతో త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ సైతం వెలువడనున్నట్లు తెలుస్తోంది. అయితే గత మూడేళ్లుగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై వివాదం సాగుతున్న వేళ.. తాజా పరిమాణం కాంగ్రెస్ పార్టీకి ఊరట కలిగిస్తోంది.

టీమిండియా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ప్రస్తుతం రాష్ట్రంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఈ పదవిలో కొనసాగాలంటే ఈ నెల 30వ తేదీ లోగా శాసనసభ లేదా శాసనమండలిలో కచ్చితంగా సభ్యుడి కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా కోదండరాంతో పాటు అజారుద్దీన్ పేరును సైతం కాంగ్రెస్ ప్రభుత్వం సిఫార్సు చేసింది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మంత్రి పదవిలో కొనసాగడానికి అజారుద్దీన్ కు లైన్ క్లియర్ అయినట్లైంది.

అయితే తెలంగాణలో ఈ గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియాకంపై ఎంతో కాలంగా వివాదం సాగుతోంది. గత బీఆర్ఎస్ పాలనలోనే ఈ వివాదానికి బీజం ఏర్పడింది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వం తరపున దాసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను సిఫార్సు చేశారు. అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరాజన్ ఆ పేర్లను తిరస్కరించారు. వారు రాజకీయ నేపథ్యం ఉన్నవారని.. సేవ, సాంస్కృతిక రంగాలకు చెందినవారు కాదని పేర్కొన్నారు. దీనిపై అఫ్పట్లో బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.

అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. పాత సిఫార్సులను పక్కనపెట్టి ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను అప్పటి గవర్నర్ (జిష్ణు దేవ్ వర్మ)కు సిఫార్సు చేసింది. గవ్నర్నర్ ఆమోదంతో వారు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయితే దీనిని సవాలు చేస్తూ దాసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ పేర్లను తిరస్కరించడం చెల్లదని, అది గవర్నర్ పరిధిలోకి రాదని వాదించారు.

Also Read: Congress vs BRS: ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ.. మళ్లీ ENOకి పనిబడిందా? బీఆర్ఎస్‌పై సెటైర్లు!

దీంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాలపై స్టే విధించింది. కోర్టు ఉత్తర్వులను తప్పుగా అర్థం చేసుకుని ప్రమాణ స్వీకారం చేయించారని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో ఇటీవల అమీర్ అలీ ఖాన్ స్థానంలో మాజీ క్రికెటర్, ప్రస్తుత మంత్రి మహ్మద్ అజారుద్దీన్ పేరును కాంగ్రెస్ ప్రభుత్వం సిఫార్సు గవర్నర్ కు సిఫార్సు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిసి కోదండరాం, అజారుద్దీన్ నియామక ఫైళ్లను త్వరగా ఆమోదించాలని కోరారు. దీంతో గవర్నర్ తాజాగా ప్రభుత్వ సిఫార్సును ఆమోదిస్తూ సంతకం చేయడం గమనార్హం.

Also Read: Kavitha New Party: బీఆర్ఎస్ కోసం రక్తం చిందించా.. కేసీఆర్ మనిషి కాదు, మర మనిషి.. విరుచుకుపడ్డ కవిత!

Related News

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

Big Stories

×