Peddamma Temple: హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్డు నెం.12 లో పెద్దమ్మ గుడి కూల్చివేతపై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని భద్రంగా భద్రపరచాలని ఆదేశించింది. పెద్దమ్మ తల్లి విగ్రహం కూల్చివేతపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ -12 లో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయం కూల్చివేత ఘటన జులై నెలలో జరిగింది. షేక్ పేట్ మండల రెవిన్యూ అధికారులు రోడ్డు విస్తరణ కోసం ఈ ఆలయాన్ని కూల్చివేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదంగా మారింది. హిందూ సంఘాలు, స్థానిక భక్తులు, హిందువులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఈ ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం చేసిన కుట్రగా సంచలన ఆరోపణలు చేసిన సందగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఓట్లు సంపాదించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వ్యాఖ్యానించారు.
ALSO READ: Indian Railway: రైల్వేలో 2418 ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండా ఉద్యోగ నియామకం
ఈ కూల్చివేత ఘటనపై హిందూ సంఘాలు, సినీ నటి కరాటే కల్యాణి వంటి ప్రముఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జులై 29న ఈ ఆలయం వద్ద జరిగిన నిరసనల సందర్భంగా పోలీసులు భక్తులను అడ్డుకోవడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆలయాన్ని పునర్నిర్మించాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని హిందు సంఘాలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఈ కేసును సీరియస్గా తీసుకుని, విచారణకు సంబంధించిన సర్టిఫికెట్స్ ను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆగస్టు 18న జరిగే తదుపరి విచారణలో ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, చట్టపరమైన అనుమతులు, రాజకీయ ఆరోపణలపై స్పష్టత రానుంది. ఈ కేసు రాష్ట్రంలో రాజకీయ, సామాజిక ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.