E-Paper
Advertisement

TS High court: దిశ నిందితుల ఎన్ కౌంటర్.. కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు

TS High court: దిశ నిందితుల ఎన్ కౌంటర్.. కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు
Advertisement

TS High court: దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసులో పోలీసులకు హైకోర్టులో ఊరట లభించింది. దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సిర్పూర్కర్ కమిషన్ నివేదిక ఇవ్వగా..దీనిపై పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

దేశ వ్యాప్తంగా దిశ అత్యాచారం ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే అయితే.. ఈ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ అంశం కూడా తీవ్ర దుమారం రేపింది. ఎన్ కౌంటర్ పై కోర్టులో కేసు నడుస్తోంది. అయితే దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు సిర్పూర్కర్ కమిషన్ ను నియమించింది. కాగా కమిషన్ నివేదిక కూడా ఇచ్చింది. నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించింది. ఈ నివేదికపై పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం షాద్ నగర్ తహశీల్దారు, పోలీసులపై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

Advertisement

Also Read:ఓయూ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. వేసవి సెలవుల్లోను హాస్టల్ ఓపెన్

సుప్రీం కోర్టు నియమించిన సిర్పూర్కర్ కమిషన్..క్షేత్ర స్థాయిలో పర్యటించి పలువురిని విచారించింది. ఎన్ కౌంటర్ చేసిన పోలీసులపై హత్యానేరం క్రింద కేసు నమోదు చేసి విచారించాలని కమిషన్ పేర్కొనగా..నివేదిక సరిగ్గా లేదని పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తీర్పు వెలువరించింది.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×