Hyderabad Crime: హైదరాబాద్ లో డెలివరీల విషయంలో తలెత్తిన గొడవలు ఓ యువకుని హత్యకు దారి తీశాయి. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ హత్య నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కోకాపేట నివాసి సమద్ (31) నార్సింగిలోని బ్లింకిట్ సంస్థలో డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. అదే సంస్థలో పని చేస్తున్న మరో వ్యక్తితో అతనికి స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలోనే డెలివరీల విషయంలో ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తాయి.
Also Read: స్వాతంత్రం రోజున కూడా.. ప్రజల్ని వదలని పాక్.. ఇంధన ధరలు పెంచి బిగ్ షాక్!
గురువారం రాత్రి పనిచేసే చోట మరోసారి ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. మాటా మాటా పెరిగిపోవటంతో సమద్ పై ఇనుపరాడ్ తో నిందితుడు దాడి చేశాడు. తలపై బలమైన గాయం కావంటంతో సమద్ అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలియగానే అక్కడికి వెళ్లిన నార్సింగి పోలీసులు.. సమద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ఒకేసారి స్వాతంత్రం వస్తే.. పాక్లో ఆగస్టు 14నే వేడుకలు ఎందుకు? 1947లో ఏం జరిగింది?