E-Paper
Advertisement

Hyderabad Mayor: అనూహ్యంగా మెట్రో రైలులో ప్రయాణించిన మేయర్.. ఆమెను చూసి అంతా షాక్!

Hyderabad Mayor: అనూహ్యంగా మెట్రో రైలులో ప్రయాణించిన మేయర్.. ఆమెను చూసి అంతా షాక్!

Hyderabad Mayor Travelled in MTRO train: అనూహ్యంగా మెట్రో రైలులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు హైదరాబాద్ మేయర్ విజయ లక్ష్మీ. మూసరంబాగ్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆమె మెట్రో అధికారులకు పలు సూచనలు చేశారు. గణేష్ నిమజ్జనం కోసం భక్తులకు స్వాగతం పలుకుతూ పోస్టర్లను ఏర్పాటు చేయాలంటూ వారికి ఆమె సూచించారు. అదేవిధంగా నిమజ్జనాలు జరిగే రోజు ఎక్కువ సమయం వరకు మెట్రో రైళ్లను నడుపాలని, ప్రయాణికులకు సరైన ఏర్పాట్లు చేయాలంటూ ఆమె సూచించారు. మెట్రోలో ప్రయాణిస్తూ పలువురి ప్రయాణికులతో మాట్లాడి మెట్రో సేవలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఇటు ప్రయాణికుల నుంచి వచ్చే సూచనలను కూడా మెట్రో అధికారులు స్వీకరించాలన్నారు.

Also Read: రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నేతల అరెస్టు

ఇటు ఎల్లుండి ఖైరతాబాద్ భారీ వినాయకుడిని నిమజ్జనం చేయనున్నారు. స్వామివారి దర్శనానికి నేడు చివరి రోజు కావడం, నేడు ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఖైరతాబాద్ కు వస్తున్నారు. లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్ కు క్యూ కడుతూ వినాయకుడిని దర్శించుకుంటున్నారు. అయితే, ఎల్లుండి వినాయకుడి నిమజ్జనం కార్యక్రమానికి సంబంధించి రేపు ఏర్పాట్లు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే భక్తులు దర్శించుకునేందుకు ఈరోజు వరకు అవకాశం కల్పించారు. ఈ క్రమంలో నగరంలో వివిధ ప్రాంతాలు, ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి బడా వినాయకుడిని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్, లక్డీకాపూల్ మెట్రో స్టేషన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆ మెట్రో స్టేషన్లలో ఎక్కడ చూసిన జనమే కనిపిస్తున్నారు. జనాలు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఖైరతాబాద్ భక్తులతో కిటకిటలాడుతోంది. దీంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు ఆ ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.

Also Read: హైదరాబాద్ గణేశ్ నిమజ్జనాలపై దుష్ప్రచారం.. మంత్రి పొన్నం క్లారిటీ

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×