E-Paper
Advertisement

Kidney Racket Bust: కిడ్నీ దందాలో కీలక మలుపు.. హాస్పిటల్ చైర్మన్ అరెస్ట్

Kidney Racket Bust: కిడ్నీ దందాలో కీలక మలుపు.. హాస్పిటల్ చైర్మన్ అరెస్ట్
Advertisement

సరూర్‌నగర్ కిడ్నీ రాకెట్‌ కేసులో పేషెంట్ల దగ్గర ఒక్క ఆపరేషన్‌కు 55లక్షల డీల్ కుదుర్చుకున్నారు డాక్టర్లు. అమాయకుల్ని ఆసరాగా చేసుకుని అలకనంద హాస్పిటల్ యాజమాన్యం కిడ్నీ రాకెట్ దందా నడుపుతోంది. డబ్బు ఆశ చూపి పక్క రాష్ట్రాలకు చెందిన వారికి అక్రమంగా శస్త్ర చికిత్సలు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ప్రదీప్ అనే మీడియేటర్ ద్వారా పేషెంట్స్ హాస్పిటల్‌కు రాగా.. పవన్ అనే డాక్టర్ ఆపరేషన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. డోనర్స్ రాజశేఖర్, బట్టు ప్రభ కిడ్నీలను.. కర్ణాటక, తమిళనాడుకు చెందిన నస్రిన్ భాను, ఫిర్దోస్ అనే ఇద్దరు మహిళలకు అమర్చారు. డబ్బుల వ్యవహారాన్నంతా ప్రదీప్ డీల్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Advertisement

గుర్తు తెలియని వ్యక్తులు డీఎంహెచ్‌ఓ గీతకు ఫోన్‌ చేసి అలకనంద హాస్పిటల్‌పై ఫిర్యాదు చేశారు. గీత సరూర్‌నగర్ పోలీసులకు కంప్లైంట్ చేయగా.. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా కిడ్నీ మార్పిడి జరుగుతోందని గుర్తించారు. హాస్పిటల్‌లో తనిఖీలు చేసిన పోలీసులు, ఆరోగ్యశాఖ అధికారులు హాస్పిటల్‌ను సీజ్ చేశారు.

ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కేసుపై ఆరా తీశారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల నుంచి వివరాలు తెప్పించుకుని పరిశీలించారు. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని డాక్టర్లను హెచ్చరించారు.ఈ కేసులో ఇన్వాల్వ్ అయివారందరినీ చట్ట ప్రకారం కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

Advertisement

Also Read: హైదరాబాద్‌లో డాక్టర్ల అరాచకం.. ఏకంగా మనిషి కిడ్నీలనే..?

అలకనంద ఆస్పత్రి వద్ద AIYF నేతలు ఆందోళనకు దిగారు. అమాయకపు ప్రజలకు డబ్బు ఆశ చూపి.. మోసాలకు పాల్పడ్డ ఆస్పత్రి యాజమాన్యం చర్యలు తీసుకోవాలన్నారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అలకనంద ఆస్పత్రి కిడ్ని రాకెట్ ఇష్యూపై ప్రభుత్వ సీరియస్ అయింది. నిజానిజాలు బయటపెట్టేందుకు కమిటీని నియమించింది. ఉస్మానియా మాజీ సూపరిండెంట్ నాగేందర్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. అలకనంద ఆస్పత్రిని పరిశీలించిన కమిటీ.. గాంధీ ఆస్పత్రికి బయలుదేరారు.

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×