E-Paper
Advertisement

Kavitha: కూలి రైతుగా మారిన కవిత.. చేనులో పత్తి తీసి రైతులతో మాట్లాడి..!

Kavitha: కూలి రైతుగా మారిన కవిత.. చేనులో పత్తి తీసి రైతులతో మాట్లాడి..!
Advertisement

Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా రైతులు, వ్యవసాయ కూలీలతో మమేకమయ్యారు. జాగృతి జానం బాట కార్యక్రమంలో ఆమె జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే.. చెనాకా – కొరాటా బ్యారేజ్ సమీపంలోని పత్తి చేనులో పత్తి తీస్తున్న మహిళా కూలీలను ఆమె కలిశారు. కేవలం పలకరించి వెళ్లడమే కాకుండా.. వారితో కలిసి ముచ్చటిస్తూ.. కొంత సమయం పాటు కవిత స్వయంగా పత్తి తీశారు.

ఉదయం నుంచి చేనులో శ్రమిస్తున్న మహిళా కూలీల వద్దకు చేరుకున్న కవిత వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పత్తి తీసే విధానాన్ని దగ్గరుండి చూశారు. అనంతరం.. కవిత కూడా వారితో కలిసి పత్తి తీయడం మొదలుపెట్టారు. చకచకా పత్తి తీస్తూ.. కూలీల కష్టం ఎంత గొప్పదో స్వయంగా అనుభవించారు. ఈ దృశ్యం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి.. ఆనందానికి గురిచేసింది.

Advertisement

పత్తి తీస్తున్న సమయంలోనే.. కవిత కూలీలతో మాటామంతి జరిపారు. వారి కుటుంబ నేపథ్యాలు, పిల్లల చదువులు, పొలంలో ఎదురవుతున్న ఇబ్బందులు, ముఖ్యంగా పత్తికి వస్తున్న ధర, కూలీల గిట్టుబాటు వంటి విషయాలపై ఆమె ఆరా తీశారు. కూలీల దైనందిన జీవితంలో ఎదురవుతున్న కష్టసుఖాలను ఓపికగా విన్నారు. పత్తి తీయడానికి రోజుకు ఎంత కూలీ వస్తుంది..? ఎంత సమయం పనిచేయాల్సి వస్తుంది..? వంటి వివరాలను తెలుసుకున్నారు. కూలీలు కూడా తమ సమస్యలను, ప్రభుత్వ పథకాల గురించి తమ అభిప్రాయాలను కవితతో పంచుకున్నారు.

ALSO READ: Jubilee Hills bypoll: సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం.. కాంగ్రెస్‌లో ఫుల్ జోష్, జూబ్లీ వార్ వన్ సైడేనా..?

Advertisement

కూలీలతో గడిపిన అనంతరం కవిత మాట్లాడుతూ.. ‘తెలంగాణలో వ్యవసాయం పండుగలా మారడానికి కారణం రైతులతో పాటు పొలంలో శ్రమించే ఈ కూలీలే. మహిళలు ఇంటి పనులతో పాటు పొలం పనుల్లోనూ చురుకుగా పాల్గొంటూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. వీరి శ్రమ వెలకట్టలేనిది. వీరికి సరైన గిట్టుబాటు ధర, మెరుగైన సౌకర్యాలు అందాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. పత్తికి మంచి ధర లభించాలని.. కూలీల కష్టానికి తగిన ఫలితం దక్కాలని ఆమె ఆకాంక్షించారు.

ALSO READ: Pawan Kalyan: ఆలయాల్లో భక్తుల భద్రత, సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించండి.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

మొదట ఆశ్చర్యపోయినా.. తమతో కలిసి కవిత పత్తి తీయడంపై మహిళా కూలీలు సంతోషం వ్యక్తం చేశారు. తమ కష్టాన్ని గుర్తించినందుకు.. తమతో కలిసి పనిచేసినందుకు వారు కవితకు ధన్యవాదాలు తెలిపారు. రాజకీయ నాయకురాలు తమతో కలిసి పనిచేయడం తమకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిందని వారు పేర్కొన్నారు. ఈ పర్యటన ద్వారా కవిత సామాన్య ప్రజల కష్టాలను దగ్గరగా చూసి తెలుసుకోవడానికి ప్రయత్నించారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×