E-Paper
Advertisement

Delhi: కవిత విక్టరీ సింబల్.. మంగళవారం మళ్లీ ఎంక్వైరీ.. టెన్షన్ కంటిన్యూ..

Delhi: కవిత విక్టరీ సింబల్.. మంగళవారం మళ్లీ ఎంక్వైరీ.. టెన్షన్ కంటిన్యూ..
Advertisement

Delhi: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. బయటకు వచ్చిన కవిత.. విక్టరీ సింబల్ చూపిస్తూ.. స్మైల్ ఇస్తూ కనిపించారు. రోజంతా ఫుల్ టెన్షన్ నెలకొనగా.. ఎట్టకేళకు అప్‌డేట్ వచ్చింది.

అయితే అంతలోనే మరో బ్రేకింగ్ న్యూస్. మంగళవారం ఉదయం 11 గంటలకు మళ్లీ విచారణకు రావాలంటూ ఈడీ తెలిపింది. దీంతో.. కవిత అరెస్ట్‌పై టెన్షన్ కంటిన్యూ అవుతోంది. మంగళవారం ఏం జరుగుతుందోననే ఉత్కంఠ మొదలైంది.

Advertisement

సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకూ.. సుదీర్ఘంగా 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించింది ఈడీ. బినామీగా భావిస్తున్న అరుణ్ రామచంద్ర పిళ్లైని, కవితను ఎదురెదురుగా ఉంచి సమగ్రంగా విచారించారు. మనీశ్ సిసోడియాతోనూ కలిపి విచారించారు. పీఎంఎల్‌ఏ సెక్షన్ 50 కింద కవితను ప్రశ్నించారు. మద్యం కేసులో మనీలాండరింగ్‌పై విచారణ జరిపారు.

ఈడీ కార్యాలయం దగ్గర సాయంత్రం తర్వాత హైటెన్షన్ నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు. వైద్యుల బృందం వెళ్లి కవితకు వైద్య పరీక్షలు చేసింది. కవిత తరఫు లీగల్ టీమ్ సైతం కార్యాలయంలోకి వెళ్లి ఈడీ అధికారులను కలిసింది. వారిలో తెలంగాణ అడిషనల్ ఏజీ కూడా ఉన్నారు. విచారణపై కవిత లాయర్ల టీమ్‌కు ఈడీ బ్రీఫింగ్ ఇచ్చినట్టు సమాచారం.

Advertisement

ఇదే సమయంలో బీఆర్ఎస్ శ్రేణులకు బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ ఏర్పడిందని బీజేపీ బరితెగించి దాడులు చేస్తోందని.. పనికిమాలిన పార్టీలు దుష్ప్రచారం చేస్తాయని.. వాటిని తిప్పికొట్టాలని కేడర్‌కు పిలుపు ఇచ్చారు. ఎప్పుడైనా ధర్మమే జయిస్తుందని.. భయపడేది లేదన్నారు గులాబీ బాస్.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మొదటినుంచీ సంచలనమే. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో పాటు అనేక మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించింది ఈడీ. ఇప్పుడు కవిత వంతు వచ్చింది. సౌత్‌ గ్రూప్‌లో కవితనే కీ పర్సన్ అని ఈడీ భావిస్తోంది. ఆప్ నేతలకు 100 కోట్లు ముడుపులు అందించారనేది ఈడీ ఆరోపణ.

ఇండోస్పిరిట్‌ కంపెనీలో వాటాదారుగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లై.. కవిత బినామీనే అంటూ ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్‌లో ప్రస్తావించింది ఈడీ. కవిత తన పది ఐ-ఫోన్లను ధ్వంసం చేయడం.. మనీష్ సిసోడియాతో మాట్లాడటం.. అభిషేక్ బోయిన్‌పల్లి, విజయ్ నాయర్లను కలవడం.. అడిటర్ బుచ్చిబాబు ప్రతినిధిగా వ్యవహరించడం.. ఇలా అనేక కోణాల్లో కవితను ప్రశ్నించింది ఈడీ.

ఇప్పటికే రెండు దఫాలుగా కవితను సుదీర్ఘంగా విచారించింది ఈడీ. ఆమెను అరెస్ట్ చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా.. ఇప్పటి వరకైతే అలాంటిదేమీ జరగలేదు. అయితే, మంగళవారం మరోసారి విచారణకు రావాలంటూ ఈడీ తెలపడంతో.. కవిత అరెస్ట్‌పై హైటెన్షన్ అలానే ఉంది.

Related News

ఫోక్స్‌వ్యాగన్‌లో భారీ లేఆఫ్స్.. లక్ష మంది ఉద్యోగులకు షాక్!

సురేఖకు సవాళ్ల మీద సవాళ్లు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా?

సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమరం.. మాటల తూటాలకు రెడీ!

కులాన్ని మార్చేసి మరీ ఏపీ DSC లో ఉద్యోగాలు.. బిగ్ టీవీ ఆపరేషన్‌లో బయటపడ్డ సంచలనాలు

సొంత పార్టీపై సెటైర్లు వేస్తే సీన్ రివర్స్.. కాంగ్రెస్‌లో కొత్త రూల్!

ముఖం బాగ‌లేక అద్దం ప‌గ‌ల గొట్టిన‌ట్టు…! అద్దంలా ఉన్న‌దున్న‌ట్టు చూపితే అంత ఉలుకెందుకు? బిగ్ టీవీ ఇన్‌స్టాగ్రామ్‌ను నిషేధిస్తే నిజాలు ఆగుతాయా?

ఏపీలో DSC స్కాం ఎఫెక్ట్.. బిగ్ టీవీ సోషల్ మీడియా అకౌంట్ బ్లాక్!

అసెంబ్లీని బ‌హిష్క‌రించిన మాజీ సీఎంలు.. ప్ర‌తిన‌ బూని మ‌ళ్లీ సీఎంగానే అడుగుపెట్టి.. ! జ‌య‌లలిత ఎపిసోడ్ టోట‌ల్ డిఫ‌రెంట్‌..

Big Stories

Advertisement
×