E-Paper
Advertisement

పెద్ది కుటుంబానికి అండగా కేసీఆర్.. ఫ్యామిలీకి రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం!

పెద్ది కుటుంబానికి అండగా కేసీఆర్.. ఫ్యామిలీకి రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం!
Advertisement

KCR Aid: అనారోగ్యంతో మరణించిన పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అండగా నిలిచారు. ఆ కుటుంబానికి పార్టీ తరపున రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. అందులో పెద్ది ఇద్దరు కుమారులకు చెరో రూ.కోటి ఇవ్వనుండగా.. అనారోగ్యంతో ఉన్న పెద్ది తల్లి అమృతమ్మ వైద్య ఖర్చుల కోసం మరో రూ.25 లక్షలు కేటాయించారు. వరంగల్ జిల్లా ముఖ్యనేతలతో చర్చించిన అనంతరం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

అయితే పెద్ది ఫ్యామిలీకి ఈ ఆర్థిక సాయంతో పాటు పిల్లల భవిష్యత్తు, చదువుకు బీఆర్ఎస్ తరపున అండగా నిలవాలని కేసీఆర్ నిర్ణయించారు. పెద్ది కుటుంబ బాగోగులను పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తుందని స్పష్టం చేశారు. దివంగత నేత దశదినకర్మల కార్యక్రమం ముగిసిన తర్వాత పెద్ది కుటుంబంతో చర్చించి.. వారి అభిప్రాయలకు అనుగుణంగా పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Advertisement

Also Read: అమ్మాయి ఆత్మహత్య వెనుక అంతర్జాతీయ కుట్ర… తెలుగులోనే ఉంది ఈ పాపులర్ క్రైమ్ థ్రిల్లర్

ఇదిలా ఉంటే ఆదివారం నర్సంపేట నియోజకవర్గంలోని పెద్ది స్వగ్రామమైన నల్లబెల్లికి కేసీఆర్ వెళ్లనున్నారు. ఇంటి పెద్దను కోల్పోయి బాధలో ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు. అటు ముఖ్యనేతను కోల్పోయి విషాదంలో మునిగిపోయిన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, పెద్ది అభిమానుల్లోనూ కేసీఆర్ ధైర్యం నింపనున్నారు.

Advertisement

Also Read: ఇద్ద‌రూ దోస్తులే.. మ‌రి బెడిసికొట్టిందెక్క‌డ‌..? ఇక ఆయ‌న‌ను న‌మ్మ‌డ‌మూ క‌ష్ట‌మేనా..?

Tags

Related News

రెంట్ ఆన్ బాయ్‌ఫ్రెండ్ పేరుతో కొత్త సైబర్ స్కామ్.. యువతను అలర్ట్ చేసిన సీపీ సజ్జనార్!

తెలంగాణలో ఇందిరమ్మ ఇడ్ల పై బిగ్ అప్‌డేట్.. తొలి విడత లాటరీ తేదీలు ఇవే!

తెలంగాణలో సదరం సర్టిఫికెట్ల స్కామ్ లీక్.. 89 మంది ఉద్యోగులపై వేటు!

హైడ్రా ఉద్యోగాల ఈవెంట్స్.. సరూర్‌నగర్ స్టేడియం వద్ద గందరగోళం!

బంజారాహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. 11 మందిని కాపాడిన ఫైర్ సిబ్బంది!

51 లక్షల లడ్డూతో బిగ్ ప్లాన్.. రూ. 4 కోట్లతో జంప్! మై హోమ్ భుజాలో అసలేం జరిగింది?

సీపీ సజ్జనార్‌పై ఫిర్యాదు.. ట్రైనీ ఐపీఎస్ కేసులో ఊహించని మలుపు!

Big Stories

Advertisement
×