BigTV English

Khairatabad Ganesh 2025: ఆపరేషన్ సింధూర్ థీమ్‌తో ఖైరతాబాద్ గణేష్.. మోడీ, అమిత్‌ షాలకు ఆహ్వానం

Khairatabad Ganesh 2025: ఆపరేషన్ సింధూర్ థీమ్‌తో ఖైరతాబాద్ గణేష్.. మోడీ, అమిత్‌ షాలకు ఆహ్వానం

Khairatabad Ganesh 2025: ప్రతి సంవత్సరం ప్రత్యేకతను సొంతం చేసుకునే ఖైరతాబాద్ గణేష్ ఈసారి మరో కొత్త రూపంలో దర్శనమివ్వబోతున్నాడు. వినాయక చవితికి నెలలపాటు ఎదురు చూసే భక్తుల కళ్లల్లో ఆనందం మిగిల్చే ఈ విగ్రహం.. ఈసారి దేశభక్తికి ప్రతీకగా నిలవబోతుంది. దానికి తోడు పర్యావరణానికి హాని కలిగించని విధంగా మట్టితో విగ్రహాన్ని తయారుచేయడం విశేషం.


హైదరాబాద్ నగరంలో వినాయక చవితి అంటేనే ప్రత్యేక గుర్తింపు ఉన్నది ఖైరతాబాద్ గణేష్‌ కే. దశాబ్దాలుగా భక్తులను తన వైపుకు ఆకర్షించుకుంటూ వస్తున్న ఈ గణేశుడు.. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక ఇతివృత్తం ఆధారంగా రూపుదిద్దుకుంటూ వస్తున్నాడు. ఇక 2025 వినాయక చవితికి ఆయన సరికొత్త అర్థంతో, దేశభక్తి సందేశంతో, మట్టితో తయారవుతున్నాడు.

ఈ ఏడాది సరికొత్తగా..
ఈ ఏడాది ఖైరతాబాద్ గణేష్ ఆపరేషన్ సింధూర్ అనే జాతీయ స్థాయి థీమ్‌తో రూపుదిద్దుకుంటున్నాడు. దేశమంతా గర్వపడే విధంగా రూపొందించే ఈ విగ్రహం మానవాళి క్షేమం కోసం గణపతి జోక్యాన్ని సూచించేలా ఉంటుంది. శ్రీ విశ్వశాంతి మహా శక్తి గణపతి అనే పేరుతో ఉన్న ఈ రూపం దేశానికి శాంతిని, భద్రతను తీసుకురావాలన్న ఆకాంక్షను ప్రతిబింబిస్తుందని భక్తులు అంటున్నారు.


కళాకారులు ఎందరో తెలుసా?
ఈ భారీ విగ్రహాన్ని తయారుచేయడానికి ఇప్పటికే 4 రాష్ట్రాల నుండి వచ్చిన 150 మందికి పైగా కళాకారులు పనిచేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశాల నుంచి వచ్చిన ఈ నిపుణులు ఉదయం నుంచి రాత్రి వరకు దానిని తయారుచేయడంలో నిమగ్నమయ్యారు. ఈ విగ్రహాన్ని పూర్తిచేయడానికి 4 నెలల సమయం పడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.

మట్టితో గణనాధుడు
ఇప్పటి వరకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP)తో విగ్రహాలను తయారుచేసినా, ఈసారి మాత్రం పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని గుజరాత్‌ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా తెచ్చిన బంకమట్టితో గణేశుడిని తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే 1,000 సంచుల మట్టి ఆర్డర్ చేశారు. ఒక్కో సంచి బరువు 35 కిలోలు. దీనికితోడు విగ్రహ నిర్మాణానికి 20 టన్నుల ఇనుము, వరిపొట్టు పొడి, ఇనుప మెష్, వాటర్ కలర్స్ వంటి పదార్థాలు వాడుతున్నారు.

Also Read: Telangana Govt: తెలంగాణలో సరికొత్త ప్రోగ్రామ్.. సీఎం రేవంత్ స్పెషల్ నజర్.. అసలు విషయం ఏమిటంటే?

ఇంత భారీ విగ్రహ నిర్మాణానికి ఖర్చు మాత్రం తక్కువ కాదు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రతి ఏడాది రూ.1 కోటి నుంచి రూ.1.5 కోట్ల వరకు విగ్రహ తయారీకి ఖర్చవుతుంది. 1954లో ఒక అడుగు విగ్రహంతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవం, ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధిగాంచిన పండుగలలో ఒకటిగా మారింది. ప్రతి సంవత్సరం 60 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉండే విగ్రహాన్ని నిర్మించడం ఖైరతాబాద్ ప్రత్యేకత. ఈసారి కూడా అదే స్థాయిలో ఉండే విగ్రహాన్ని మట్టితో తయారుచేయడం విశేషం.

ఈసారి కొత్త అతిథులు
ఇక పండుగ రోజుల్లో ఖైరతాబాద్ గణపతి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య కూడా చూపరులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఉత్సవాల 10 రోజులలో సుమారు 10 నుండి 15 లక్షల మంది భక్తులు నిమజ్జనానికి వస్తారని అంచనా. ఇందుకోసం భారీ భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి ఉత్సవాన్ని మరింత విశిష్టంగా నిర్వహించేందుకు కమిటీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు ఆహ్వానం పంపాలన్న యోచనలో ఉన్నట్లు కమిటీ సభ్యులు పేర్కొంటున్నారు.

ఖైరతాబాద్ గణేష్.. ఇది గణపతిని చూసే విశ్వాసమే కాదు, ఇది మన సంస్కృతి, దేశభక్తి, పర్యావరణం పట్ల నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం. ఆపరేషన్ సింధూర్ అనే ఇతివృత్తంతో మట్టితో తయారవుతున్న గణేశుడు ఈ సంవత్సరం మరింత భక్తులను ఆకర్షించబోతున్నాడు.

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×