Khairatabad: హైదరాబాద్ వాసుకులకు ఈనెల 14 నుంచి ఖైరతాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు. దీంతో ఈ ప్రదేశాల్లో ఏవరు రావద్దని ఈ ప్రాంతాల్లొ ప్రయాణించే వారు మరో మార్గాలను చూసుకోవాలని తెలిపారు. అయితే ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లను ఏర్పాట్లను చేశారు. దీంతో వచ్చే 14 తేది నుండి ఈనెల 23 వరకు ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనం కోసం భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేసారు. దీంతో ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.
ఖైరథాబాద్ గణేశున్ని దర్షించకోవడానికి ప్రతిఎటా భారీగా ప్రజలు తరలి వస్తుంటారు. అయితే ఈ సంవత్సరం దాదాపుగా 30 లక్షల మంది భక్తులు తరలిరానున్నట్టు పోలీసులు అంచనా వేసారు. ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి భక్తులు ఎక్కువగా మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సుల్లో రావాలని పోలీసులు సూచలను చేశారు. ప్రజా రవాణాతో ట్రాఫిక్ అంతరాయం తగ్గుతుందని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డెవిస్ భక్తులకు క్లారిటీ ఇచ్చారు.
Also read: తక్కువ ధరలో బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్.. రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ ఇంట్లోనే
ఖైరతాబాద్ వినాయకుడిని దర్షనం కోసం వచ్చే భక్తులకోసం ఐమ్యాక్స్, HMDA స్థలం, ఎన్టీఆర్ పార్క్. నెక్లెస్ రోడ్లో పార్కింగ్ సదుపాయం కల్పించామని జాయింట్ సీపీ జోయల్ డెవిస్ తెలిపారు. వీటితో పాటుగా వీఐపీల కోసం ప్రత్యేక రూట్ ఏర్పాటు చేశామని తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని భక్తులందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.
Also read: అంతరిక్షం అడుగుపెట్టి.. సొంత శాటిలైట్లతో సత్తా చాటి.. 80ల్లో ISRO అంటే ఫ్లవర్ కాదు ఫైర్!