22A Lands: 22ఏ భూముల అశంపై శాసన సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. ఈ సమస్య దశాబ్దాలుగా కొనసాగుతోందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి ఈ సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. 22ఏ చట్టం వచ్చినప్పటి నుంచి సమస్య అలాగే ఉందని, BOT యాక్ట్ ప్రకారం ఈ సమస్యపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి క్లారిటీ ఇచ్చారు. తొమ్మిదిన్నరేళ్లు పాలించిన వారికి ఈ సమస్య పరిష్కరించాలనే ఆలోచన ఏనాడైనా వచ్చిందా.. 22ఏ భూముల సమస్య ఉందని ఏనాడైనా గుర్తించారా అని ప్రశ్నించారు.
సమస్యను గుర్తించని వారు ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఏ పరిజ్ఞానంతో ముఖ్యమంత్రిని మంత్రులను విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో అదే ఆలోచనలో ఉన్నారని, ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తుందని భావించడం సరికాదని అన్నారు. ఈ ప్రభుత్వం నిరంతరం పేదవాడి కోసం పనిచేస్తోందని, పేదవాడికి అండగా నిలవడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి పొంగులేటి క్లారిటీ ఇచ్చారు.
Also read: తక్కువ ధరలో బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్.. రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ ఇంట్లోనే
కళ్లుండి కూడా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూడలేకపోతున్నారు. లక్షల ఎకరాలను ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టారని ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి ఫైర్ అయ్యారు. చేతులు విసిరితే సరిపోదు.. వాస్తవాలు తెలుసుకోవాలని గాటు విమర్షలు చేసారు. పొడవాటి చేతుల కంటే బుర్రను ఉపయోగించాలంటూ బీఆర్ఎస్ నాయకులపై సెటేర్ల వేసారు. 22ఏ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి పొంగులేటి క్లారిటీ ఇచ్చారు.
Also read: బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా సుప్రీత.. ఏమన్నారంటే?