Konda Murali: మరో సారీ కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తెలంగాణ కాంగ్రెస్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయం ఓక్కసారిగా వేడిక్కింది. కొండా మురళి నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ కొండా మురళి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల మధ్య తీవ్ర స్థాయికి చేరాయి. దీంతో కొండా మురళి చేసిన వ్యాఖ్యలు జిల్లావ్యాప్తంగా సంచలనంగా రేపుతున్నాయి. పార్టీలో నన్నెవరు గెలుకోద్దంటూ కొండా మురళి ఫైర్ అయ్యారు. కావాలని మాపై కొంత మంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అయితే గతంలో ఏఐసీసీ ఆదేశాలతో తెలంగాణ మంత్రి వర్గంలో పనిచేసిన కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి పదవి నుండి తప్పించిన విషయం మనందరికి తెసిన విషయమే.. అయితే సీఎం రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ కూతురు యశస్వని రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో ఈ విషయంపై కొండా సురేఖను మంత్రి పదవినుండి తప్పించారు.
Also read: నిద్రమత్తులో రైళులోనుండి దూకిన యువకుడు.. చివరికి ఏమైందంటే?
కాంగ్రెస్ పార్టీలో పదవులపై తమకు ఎలాంటి వ్యామోహం లేదని రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల తమకు సంపూర్ణ విశ్వాసముందని కొండా మురళి స్పష్టం చేశారు. అయితే కావాలని మాపై కొంత మంది రాజకీయ శక్తులు ఏకమై మాపై కావాలని దాడులు చేసేలా ప్రయత్నిస్తున్నారని అన్నారు. మాపై ఎన్ని అడ్డంకులు వచ్చినా నిలబడతామని, రాజకీయం నుండి వెనక్కి తప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎవరైనా మమ్ములను రెచ్చగొడితే సహించేది లేదంటూ.. “నేనేంటో అందరికీ తెలుసు, నన్ను దేనికీ భయపెట్టలేరు. నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, నేనేం చేస్తానో నాకే తెలియదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమపై కావాలని కొంత మంది కుట్రలు చేస్తున్నారని అలాంటి వారికి నేంటో చూపిస్తా అని ఫైర్ అయ్యారు. మాకార్యకర్తల విషయంలో ఏవరు తలదూర్చొద్దని గాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో కొండా మురళి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారాయి.
Also read: వందే భారత్ vs రాజధాని ఎక్స్ ప్రెస్.. ప్రయాణికులకు ఏ రైలు బెటర్.. పూర్తి వివరాలు ఇవిగో!