Khammam: స్వేచ్ఛ బ్యూరో: ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐ.యల్.పి.ఏ) జాతీయ కౌన్సిల్ సభ్యురాలిగా కొత్తగూడెం బార్ అసోసియేషన్ సభ్యురాలు మహిళా న్యాయవాది సుంకర భానుప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాగపూర్ లో జరిగిన జాతీయ మహసభ లో ఇండియాన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ జాతీయ కౌన్సిల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జాతీయ అధ్యక్షురాలిగా సుజాత చౌదంతే, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు యన్.జే.సాంసన్ కార్యవర్గ సభ్యురాలిగా సుంకర భానుప్రియ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జ్యోతిరావు పూలే, డా.బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం తో ఆవిర్భావించిన ఇండియన్ లీగల్ ప్రోఫేషనల్స్ అసోసియేషన్(ఐ.యల్. పి.ఏ) న్యాయవాదుల అభ్యున్నతి కోసం న్యాయవాదుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తు, సమాజం లో అణగారిన వర్గాల ప్రజలకు రాజ్యాంగ ఫలలు అందరికీ అందాలని, సమానత్వం కోసం, సమన ఆవకాశాలు అందరికి అందాలని సమసమాజ నిర్మాణం కోసం బామ్ సేఫ్ కు అనుబంధంగా పని చేస్తున్న సంస్థ ఇండియన్ లీగల్ ప్రోఫేషనల్స్ అసోసియేషన్ అని సుంకర భానుప్రియ తెలిపారు.
Also Read: విద్యార్ధుల ఆరోగ్యంపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్.. ఆ రెండు ట్రస్టులకు అల్పాహార భాద్యతలు..?
పూలే అంబేద్కర్ ఐడియలజీ, పే బ్యాక్ టూ సోసైటి లక్ష్యంగా పని చేస్తున్న సంఘం ఐ.యల్.పి.ఏ లో అందరు సభ్యులుగా చేరి సమసమాజ నిర్మాణం లో భాగస్వామ్యం కావాలని భానుప్రియ పిలుపునిచ్చారు. భానుప్రియ నియమకం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖ్యాతిని జాతీయ స్థాయిలో మరోసారి నిలిపిందని ఇండియాన్ లీగల్ ప్రోఫేషనల్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర భాథ్యులు న్యాయవాదులు జనపరెడ్డి గోపి కృష్ణ, మారపాక రమేష్, మహమ్మద్ సాదిక్ పాషా, డి.సామంత్, యెర్రా కామేష్, యెర్రాపాటి కృష్ణ హర్షం వ్యక్తం చేశారు.
Also Read: లాకప్లో ఆత్మహత్యలకు చెక్.. ముంబై పోలీసుల కొత్త డ్రెస్ కోడ్!