E-Paper
Advertisement

Bandi Sanjay vs KTR: నీ అమెరికా బాగోతం మొత్తం బయటపెడుతా.. కేటీఆర్ కు బండి వార్నింగ్

Bandi Sanjay vs KTR: నీ అమెరికా బాగోతం మొత్తం బయటపెడుతా.. కేటీఆర్ కు బండి వార్నింగ్
Advertisement

Bandi Sanjay vs KTR: కేటీఆర్ పరువునష్టం దావాపై స్పందించారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఇకపై తాను రాజకీయంగానే పోరాడతానన్నారు ఆయన. ఇకపై తానేంటో తప్పనిసరిగా చూపిస్తానని అన్నారు బండి సంజయ్.

బండి సంజయ్ ఘాటు ప్రతిస్పందన

Advertisement

కేటీఆర్ దావాపై స్పందించిన బండి సంజయ్ కఠిన వ్యాఖ్యలు చేశారు. నేను ఎవరికీ భయపడను. మీ నాన్న పేరు చెప్పుకుని నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు. కానీ నేను ప్రజల మద్దతుతో ఇక్కడికి చేరుకున్నాను. మీ ప్రభుత్వం నాపై 109 కేసులు బనాయించింది. అయినా నేను వెనుకడుగు వేయలేదు. ధైర్యంగా ఎదుర్కొన్నాను. కానీ నీ లాగా పరువు నష్టం దావాలు వేయలేదు అంటూ కేటీఆర్‌ను నేరుగా సవాలు చేశారు.

కేటీఆర్ ఫిర్యాదులో ఆరోపణలు

Advertisement

2025 ఆగస్టు 8న బండి సంజయ్ తప్పుడు, అసభ్యకర వ్యాఖ్యలు చేశారని, వాటిలో ఫోన్ ట్యాపింగ్, ఎస్‌ఐబీ దుర్వినియోగం, ఆర్థిక అవకతవకలు వంటి ఆరోపణలు తనపై మోపారని కేటీఆర్ తెలిపారు.

ఏబీఎన్ తెలుగు, ఎన్టీవీ, టీవీ5, వీ6, ఏఎన్ఎన్ తెలుగు వంటి ఛానెళ్లు, అలాగే ఇండియా టుడే, ఎన్డీటీవీ, డెక్కన్ హెరాల్డ్, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి మీడియా పత్రికలు, ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్, గూగుల్, మెటా వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఈ వ్యాఖ్యలను విస్తృతంగా ప్రసారం చేశాయని ఆయన ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలు తన పరువుకు భంగం కలిగించడం మాత్రమే కాకుండా, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి ఉద్దేశించబడ్డాయి అని కేటీఆర్ పేర్కొన్నారు.

లీగల్ నోటీసు – నిరాకరించిన బండి సంజయ్

కేటీఆర్ 2025 ఆగస్టు 11న బండి సంజయ్‌కు లీగల్ నోటీసు పంపించారు. అందులో బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే బండి సంజయ్ దాన్ని తిరస్కరించడంతో కేటీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

కేటీఆర్ డిమాండ్లు

ఫిర్యాదులో కేటీఆర్ కోర్టును ఆశ్రయిస్తూ పలు ముఖ్యమైన డిమాండ్లు చేశారు:

బండి సంజయ్ నుండి బేషరతుగా బహిరంగ క్షమాపణ.

ఇకపై తనపై పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయకుండా కోర్టు ఉత్తర్వులు ఇవ్వాలి.

ఇప్పటికే ప్రచురితమైన పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను.. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, మీడియా సంస్థలు తక్షణమే తొలగించాలి.

పరువు నష్టం పరిహారంగా ₹10 కోట్లు చెల్లించాలి.

రాజకీయ దుష్ప్రభావం

ఈ కేసుతో తెలంగాణలో బీజేపీ–బీఆర్‌ఎస్ వాగ్వాదం మరింత తీవ్రమైంది. ఒకవైపు బండి సంజయ్ తాను ఎప్పటికీ భయపడనని, కేసులు పెట్టినా వెనుకడుగు వేయనని చెబుతుండగా, మరోవైపు కేటీఆర్ తన పరువును కాపాడుకోవడమే లక్ష్యమని అంటున్నారు.

Also Read: తెలంగాణ జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. అక్రిడిటేష‌న్‌లపై పొంగులేటి కీలక అప్డేట్

బీజేపీ వర్గాలు దీన్ని కేటీఆర్ భయానికి నిదర్శనంగా వ్యాఖ్యానిస్తుండగా, బీఆర్‌ఎస్ నేతలు మాత్రం కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నిరాధార ఆరోపణలు చేయడం అనాగరికం అని కౌంటర్ చేస్తున్నారు.

 

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×