E-Paper
Advertisement

Bandi Sanjay vs KTR: నీ అమెరికా బాగోతం మొత్తం బయటపెడుతా.. కేటీఆర్ కు బండి వార్నింగ్

Bandi Sanjay vs KTR: నీ అమెరికా బాగోతం మొత్తం బయటపెడుతా.. కేటీఆర్ కు బండి వార్నింగ్
Advertisement

Bandi Sanjay vs KTR: కేటీఆర్ పరువునష్టం దావాపై స్పందించారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఇకపై తాను రాజకీయంగానే పోరాడతానన్నారు ఆయన. ఇకపై తానేంటో తప్పనిసరిగా చూపిస్తానని అన్నారు బండి సంజయ్.

బండి సంజయ్ ఘాటు ప్రతిస్పందన

Advertisement

కేటీఆర్ దావాపై స్పందించిన బండి సంజయ్ కఠిన వ్యాఖ్యలు చేశారు. నేను ఎవరికీ భయపడను. మీ నాన్న పేరు చెప్పుకుని నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు. కానీ నేను ప్రజల మద్దతుతో ఇక్కడికి చేరుకున్నాను. మీ ప్రభుత్వం నాపై 109 కేసులు బనాయించింది. అయినా నేను వెనుకడుగు వేయలేదు. ధైర్యంగా ఎదుర్కొన్నాను. కానీ నీ లాగా పరువు నష్టం దావాలు వేయలేదు అంటూ కేటీఆర్‌ను నేరుగా సవాలు చేశారు.

కేటీఆర్ ఫిర్యాదులో ఆరోపణలు

Advertisement

2025 ఆగస్టు 8న బండి సంజయ్ తప్పుడు, అసభ్యకర వ్యాఖ్యలు చేశారని, వాటిలో ఫోన్ ట్యాపింగ్, ఎస్‌ఐబీ దుర్వినియోగం, ఆర్థిక అవకతవకలు వంటి ఆరోపణలు తనపై మోపారని కేటీఆర్ తెలిపారు.

ఏబీఎన్ తెలుగు, ఎన్టీవీ, టీవీ5, వీ6, ఏఎన్ఎన్ తెలుగు వంటి ఛానెళ్లు, అలాగే ఇండియా టుడే, ఎన్డీటీవీ, డెక్కన్ హెరాల్డ్, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి మీడియా పత్రికలు, ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్, గూగుల్, మెటా వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఈ వ్యాఖ్యలను విస్తృతంగా ప్రసారం చేశాయని ఆయన ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలు తన పరువుకు భంగం కలిగించడం మాత్రమే కాకుండా, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి ఉద్దేశించబడ్డాయి అని కేటీఆర్ పేర్కొన్నారు.

లీగల్ నోటీసు – నిరాకరించిన బండి సంజయ్

కేటీఆర్ 2025 ఆగస్టు 11న బండి సంజయ్‌కు లీగల్ నోటీసు పంపించారు. అందులో బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే బండి సంజయ్ దాన్ని తిరస్కరించడంతో కేటీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

కేటీఆర్ డిమాండ్లు

ఫిర్యాదులో కేటీఆర్ కోర్టును ఆశ్రయిస్తూ పలు ముఖ్యమైన డిమాండ్లు చేశారు:

బండి సంజయ్ నుండి బేషరతుగా బహిరంగ క్షమాపణ.

ఇకపై తనపై పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయకుండా కోర్టు ఉత్తర్వులు ఇవ్వాలి.

ఇప్పటికే ప్రచురితమైన పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను.. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, మీడియా సంస్థలు తక్షణమే తొలగించాలి.

పరువు నష్టం పరిహారంగా ₹10 కోట్లు చెల్లించాలి.

రాజకీయ దుష్ప్రభావం

ఈ కేసుతో తెలంగాణలో బీజేపీ–బీఆర్‌ఎస్ వాగ్వాదం మరింత తీవ్రమైంది. ఒకవైపు బండి సంజయ్ తాను ఎప్పటికీ భయపడనని, కేసులు పెట్టినా వెనుకడుగు వేయనని చెబుతుండగా, మరోవైపు కేటీఆర్ తన పరువును కాపాడుకోవడమే లక్ష్యమని అంటున్నారు.

Also Read: తెలంగాణ జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. అక్రిడిటేష‌న్‌లపై పొంగులేటి కీలక అప్డేట్

బీజేపీ వర్గాలు దీన్ని కేటీఆర్ భయానికి నిదర్శనంగా వ్యాఖ్యానిస్తుండగా, బీఆర్‌ఎస్ నేతలు మాత్రం కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నిరాధార ఆరోపణలు చేయడం అనాగరికం అని కౌంటర్ చేస్తున్నారు.

 

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×