E-Paper
Advertisement

KTR Tweet: బండి సంజయ్‌పై కేటీఆర్ ట్వీట్.. ఈ చిల్లర మాటలు దేనికంటూ…

KTR Tweet: బండి సంజయ్‌పై కేటీఆర్ ట్వీట్.. ఈ చిల్లర మాటలు దేనికంటూ…
Advertisement

KTR Latest Tweet againist Bandi Sanjay: కేంద్రమంత్రి బండి సంజయ్ పై మాజీమంత్రి, సిరిసిల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిల్లర మాటలు దేనికి? అంటూ ఫైరయ్యారు. ఈ మేరకు ఆయన తాజాగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఈ విధంగా కేటీఆర్ పేర్కొన్నారు. ‘గౌరవనీయులైన బండి సంజయ్ గారు! దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు ఉంది ఈ వ్యవహారం. మీరు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అన్న విషయం మర్చిపోయినట్లు ఉన్నారు. అమృత్ పథకం మీ కేంద్ర పథకమే. అందులో అవినీతి జరిగిందని ముందుగా చెప్పిందే స్వయాన మీ పార్టీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు. అయినా పాలు తాగుతున్న దొంగ పిల్లిలా కన్వీనియంట్ గా కళ్లు మూసుకున్నారు. ఈ వ్యవహారం మొత్తం ఆధారాలతో మేం బయట పెట్టాక ఈ చిల్లర మాటలు దేనికి? సీవీసీ స్వతంత్ర సంస్థ… దానికి మీ సిఫార్సు దేనికి? అయినా మీ అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ అందూ గమనిస్తూనే ఉన్నారు!’ అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.

Also Read: కాళేశ్వరం ఇంజినీర్లపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సీరియస్

Advertisement

ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజుల నుంచి అమృత్ పథకం టెండర్ల విషయమై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ పథకం టెండర్లలో అక్రమాలు జరిగాయంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ఆ టెండర్లను సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికి ఎలా కేటాయించారంటూ ఆయన ప్రశ్నించారు. ఈ టెండర్లపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగాలన్నారు. ఆ వెంటనే మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలు సరికావన్నారు. కేటీఆర్ ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదన్నారు. అందుకు సంబంధించిన ఏమైనా ఆధారాలుంటే నిరూపించాలని డిమాండ్ చేశారు. ఆధారాలను నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానంటూ మంత్రి పొంగులేటి సవాల్ విసిరిన విషయం తెలిసిందే.

Also Read: బావబామ్మర్దులు వారి బొందను వాళ్లే తొవ్వుకుంటున్నారు: మైనంపల్లి

Related News

జోగులాంబ గద్వాల్లో భూ బకాసురుల పంజా.. నకిలీ పట్టాలతో భూమి ఆక్రమణ!

ఈనెల 14 నుండి 25 వరకు తెలంగాణలో హై అలర్ట్!

దద్దరిల్లిన హన్మకొండ.. వేలాది మంది విద్యార్థులతో కవిత భారీ పాదయాత్ర!

ప్రతిపక్షాల గొంతు నొక్కే కుట్ర.. స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై కేటీఆర్ ఫైర్!

తెలంగాణ పోలీసులకు బిగ్ షాక్.. అసెంబ్లీ గొడవపై హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ!

కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం, హత్య.. ఆత్యహత్య?

అసెంబ్లీలో మంత్రి సీతక్క భావోద్వేగ ప్రసంగం.. కన్నీళ్లు పెట్టుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్!

అధ్యక్షా మిమ్మల్నే తిడతారా.. అసెంబ్లీలో తాతా మధుపై సీఎం రేవంత్ ఫైర్!

Big Stories

Advertisement
×