BigTV English

KCR With KTR: కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ.. కాళేశ్వరంపై సీబీఐ విచారణ, ఇప్పుడేం చేద్దాం?

KCR With KTR: కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ.. కాళేశ్వరంపై సీబీఐ విచారణ, ఇప్పుడేం చేద్దాం?
Advertisement

KCR With KTR: బీఆర్ఎస్‌ పార్టీకి కాలం కలిసిరాలేదా? గ్రహాలు అనుకూలించ లేదా?  మళ్లీ యాగానికి కేసీఆర్ సిద్ధమవుతున్నారా? అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయా? తొలి ఏడాది కేటీఆర్ వంతు కాగా, రెండో ఏడాది కేసీఆర్-హరీష్‌రావు వంతయ్యిందా? న్యాయస్థానం తీర్పు వచ్చేవరకు వెయిట్ చేస్తారా? ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారా? ఫామ్‌హౌస్‌లో కేసీఆర్-కేటీఆర్ ఏయే అంశాలు చర్చకు వచ్చాయి.


కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు షాకయ్యారు. కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంకోవైపు హరీష్‌రావు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రాజకీయంగా, న్యాయపరంగా చేయాల్సివన్నీ ఆ పార్టీ నేతలు చేస్తున్నారు. ఇక మిగిలింది ఈ అంశంపై ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయినట్టు ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది.

తాజాగా సోమవారం మధ్యాహ్నం ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కి వెళ్లారు కేటీఆర్. అధినేత కేసీఆర్-కేటీఆర్ మధ్య కాళేశ్వరం అంశంపై చర్చ జరిగింది. న్యాయస్థానంలో పిటిషన్ వేసిన విషయాన్ని పెద్దాయన దృష్టికి కేటీఆర్ తీసుకెళ్లారు. మంగళవారం న్యాయస్థానంలో విచారణ జరుగుతుందని, అనుకూలంగా నిర్ణయం వస్తే ఓకేనని, రాకుంటే పరిస్థితి ఏంటన్నది అప్పుడు ఆలోచిద్దామని అన్నట్లు తెలుస్తోంది.


ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే చేసేదేమీ లేదని అన్నారట. ఈ అంశంపై సీబీఐకి ప్రభుత్వం లేఖ రాయాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత కొంత సమయం పడుతుంద న్నారు. ఈలోగా హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ALSO READ: స్థానికతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని భావిస్తున్నారట బీఆర్ఎస్ పెద్దలు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ అంశం మనకు మైలేజ్ వచ్చేవిధంగా  ప్లాన్ చేయాలని భావిస్తున్నారట. ఈ వారం లేకుండా వచ్చేవారంలో స్థానిక సంస్థల ఎన్నికల గంట మోగనుంది. దీనిపై ఆందోళనలు చేయవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలావుండగా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు యాగం చేస్తే బాగుంటుందని, కొంతైనా రిలీఫ్ లభిస్తుందని కొందరు నేతలు చెబుతున్నారు. ఈ నెల మూడోవారం నుంచి దేవీ నవరాత్రులు మొదలుకానున్నాయి. ఆలోగా యాగం చేస్తే మంచి ఫలితాలు రావచ్చని అంటున్నారు. మొత్తానికి మంగళవారం హైకోర్టు తీర్పు తర్వాత వేగంగా అడుగులు వేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది.

 

Related News

Ayodhya: కన్నుల పండువగా అయోధ్య దీపోత్సవం.. రెండు కళ్లు సరిపోవు..!

Minister Adluri: తడి బట్టలతో ఇద్దరం ప్రమాణం చేద్దామా..? హరీష్ రావుకు మంత్రి అడ్లూరి స్ట్రాంగ్ కౌంటర్

CM Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. బీఆర్ఎస్, బీజేపీలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

TG Wine Shops: తెలంగాణ మద్యం షాపుల టెండర్ల గడువు పెంపు.. ఏపీ మహిళ 150 దరఖాస్తులు!

BIG TV Free Medical Camp: ప్రజా సేవే లక్ష్యంగా.. బిగ్ టీవీ ఫ్రీ మెడికల్ క్యాంపు

Worms In Mysore Bonda: షాకైన కస్టమర్.. మైసూర్ బోండాలో పురుగులు..

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై బీఆర్ఎస్ ప్లాన్ బి.. మరో నామినేషన్ వేయించిన గులాబీ పార్టీ

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో స్టేషన్ వద్ద బుల్లెట్ కలకలం.. రంగంలోకి దిగిన పోలీసులు

Big Stories

×