E-Paper
Advertisement

KCR With KTR: కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ.. కాళేశ్వరంపై సీబీఐ విచారణ, ఇప్పుడేం చేద్దాం?

KCR With KTR: కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ.. కాళేశ్వరంపై సీబీఐ విచారణ, ఇప్పుడేం చేద్దాం?
Advertisement

KCR With KTR: బీఆర్ఎస్‌ పార్టీకి కాలం కలిసిరాలేదా? గ్రహాలు అనుకూలించ లేదా?  మళ్లీ యాగానికి కేసీఆర్ సిద్ధమవుతున్నారా? అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయా? తొలి ఏడాది కేటీఆర్ వంతు కాగా, రెండో ఏడాది కేసీఆర్-హరీష్‌రావు వంతయ్యిందా? న్యాయస్థానం తీర్పు వచ్చేవరకు వెయిట్ చేస్తారా? ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారా? ఫామ్‌హౌస్‌లో కేసీఆర్-కేటీఆర్ ఏయే అంశాలు చర్చకు వచ్చాయి.

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు షాకయ్యారు. కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంకోవైపు హరీష్‌రావు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రాజకీయంగా, న్యాయపరంగా చేయాల్సివన్నీ ఆ పార్టీ నేతలు చేస్తున్నారు. ఇక మిగిలింది ఈ అంశంపై ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయినట్టు ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది.

Advertisement

తాజాగా సోమవారం మధ్యాహ్నం ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కి వెళ్లారు కేటీఆర్. అధినేత కేసీఆర్-కేటీఆర్ మధ్య కాళేశ్వరం అంశంపై చర్చ జరిగింది. న్యాయస్థానంలో పిటిషన్ వేసిన విషయాన్ని పెద్దాయన దృష్టికి కేటీఆర్ తీసుకెళ్లారు. మంగళవారం న్యాయస్థానంలో విచారణ జరుగుతుందని, అనుకూలంగా నిర్ణయం వస్తే ఓకేనని, రాకుంటే పరిస్థితి ఏంటన్నది అప్పుడు ఆలోచిద్దామని అన్నట్లు తెలుస్తోంది.

ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే చేసేదేమీ లేదని అన్నారట. ఈ అంశంపై సీబీఐకి ప్రభుత్వం లేఖ రాయాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత కొంత సమయం పడుతుంద న్నారు. ఈలోగా హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ALSO READ: స్థానికతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని భావిస్తున్నారట బీఆర్ఎస్ పెద్దలు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ అంశం మనకు మైలేజ్ వచ్చేవిధంగా  ప్లాన్ చేయాలని భావిస్తున్నారట. ఈ వారం లేకుండా వచ్చేవారంలో స్థానిక సంస్థల ఎన్నికల గంట మోగనుంది. దీనిపై ఆందోళనలు చేయవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలావుండగా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు యాగం చేస్తే బాగుంటుందని, కొంతైనా రిలీఫ్ లభిస్తుందని కొందరు నేతలు చెబుతున్నారు. ఈ నెల మూడోవారం నుంచి దేవీ నవరాత్రులు మొదలుకానున్నాయి. ఆలోగా యాగం చేస్తే మంచి ఫలితాలు రావచ్చని అంటున్నారు. మొత్తానికి మంగళవారం హైకోర్టు తీర్పు తర్వాత వేగంగా అడుగులు వేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది.

 

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×