E-Paper
Advertisement

KTR Swedapatram : తెలంగాణ అప్పులు రూ. 3.17 లక్షల కోట్లే.. కేటీఆర్‌ స్వేదపత్రం విడుదల..

KTR Swedapatram : తెలంగాణ అప్పులు రూ. 3.17 లక్షల కోట్లే..  కేటీఆర్‌ స్వేదపత్రం విడుదల..
Advertisement

KTR Swedapatram : తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే బీఆర్ఎస్ పాలనను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడకా ఉందని.. అది అబద్ధాల పుట్ట అని ఆయన ఆరోపించారు. గత తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలోని ప్రగతి ప్రస్థానాన్ని వివరిస్తూ కేటీఆర్‌ తెలంగాణభవన్‌లో ‘స్వేదపత్రం’ పేరిట పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేసిస శ్వేతపత్రం అంకెల గారడీ అని.. అభాండాల చిట్టా అని ఘాటైన విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ నాయకులు చేసిన ఆరోపణలకు.. విమర్శలకు అసెంబ్లీలో ధీటుగా సమాధానం ఇచ్చామన్నారు కేటీఆర్.

Advertisement

అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వాయిదా వేశారని కేటీఆర్ పేర్కొన్నారు. విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రం.. విధ్వంసం నుంచి వికాసం వైపు.. సంక్షోభం నుంచి సమృద్ధివైపు తెలంగాణ అడుగులు వేశామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అన్ని రంగాల్లోనూ తెలంగాణపై వివక్ష నెలకొందన్న సంగతిని గుర్తుచేశారు.

ఎన్నో పోరాటాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం అని తెలంగాణ ఉద్యమ స్పూర్తిని చాటిచెప్పాడు.
తెలంగాణ రాష్ట్ర అప్పులు రూ.3.17 లక్షల కోట్లు కాగా.. దీన్ని కాంగ్రెస్‌ నేతలు రూ.6.70 లక్షల కోట్లుగా చూపించే ప్రయత్నం చేశారని కేటీఆర్ ఆరోపించారు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×