E-Paper
Advertisement

Telangana: నైరుతి వచ్చేసిందోచ్.. రాగల 3 రోజులు వానలోచ్.. హైదరాబాద్ అలర్ట్..

Telangana: నైరుతి వచ్చేసిందోచ్.. రాగల 3 రోజులు వానలోచ్.. హైదరాబాద్ అలర్ట్..
Advertisement
mansoon

Telangana: ఎన్నాళ్లో వేచిన రోజు. వానల కోసం ఆశగా ఎదురుచూసిన రోజు. రానే వచ్చేసింది. రెండు వారాలుగా రానురానంటూ రాయలసీమలోనే ఆగిపోయిన రుతుపవనాలు.. తెలంగాణలోకి ప్రవేశించాయి. నైరుతి ఖమ్మం గడపలో ఎంట్రీ ఇచ్చింది. రాగల మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

రుతుపవనాల ప్రభావంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, సూర్యాపేట, వరంగల్, ములుగు, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వానలు పడొచ్చు. అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవొచ్చు. లేటుగా అయినా లేటెస్ట్‌గా ఎంటరైన రుతుపవనాలతో ఈసారి సాధారణ వర్షపాతం ఉండొచ్చని అంచనా.

Advertisement

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. ఎండలు తగ్గాయి. అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటున్నాయి. అయితే, అవి రుతుపవనాల వల్ల కావని.. మామూలు వానలేనని అంటున్నారు. అసలైన వర్షాలు.. రాగల మూడురోజుల్లో ఉంటాయని చెబుతున్నారు.

హైదరాబాద్‌లో బుధవారం నుంచే వానలు వచ్చిపోతున్నాయి. సిటీ కూల్ కూల్‌గా ఉంది. ఇన్నాళ్లూ ఎండలతో మాడిపోయిన నగరవాసులు.. కాస్త రిలాక్స్ అవుతున్నారు. అయితే, వానలు పడితే అసలు నరకం ముందుంటుందనే విషయం గుర్తుకొచ్చి హడలిపోతున్నారు.

Advertisement

ఎండవేడికి ఎలాగోలా తట్టుకున్నారు ఇన్నాళ్లూ. కానీ, వానాకాలం హైదరాబాద్‌లో టార్చరే. గతంలో సరిగ్గా ఆఫీసులు క్లోజ్ చేసే సమయానికి వాన పడేది. ఉన్నపళంగా వాన దంచికొట్టేది. ఇక ఖతం. రోడ్లన్నీ జలమయం. డ్రైనేజీ వాటర్ అంతా రోడ్ల మీదకు వచ్చి చేరేది. వరద వెళ్లే మార్గం లేక.. రోడ్లన్నీ నీటితో మునిగిపోయేవి. ఇంకేం ఎక్కడి వాహనాలు అక్కడే. ఫుల్ ట్రాఫిక్ జామ్స్. గంటల తరబడి.. ట్రాఫిక్‌లో, వాన+మురుగు నీళ్లలో నరకం చూసేవారు సిటిజెన్స్. మళ్లీ వానాకాలం వచ్చిందని తెలీగానే.. గతాన్ని గుర్తు చేసుకొని టెన్షన్ పడుతున్నారు. బండ్లు, కార్లు కాకుండా.. ఈ సీజన్లో మెట్రో అయితే సో బెటర్ అనుకుంటున్నారు.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×