Medaram Jathara 2026: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర అపూర్వ విజయం సాధించిన నేపథ్యంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సచివాలయంలో మీడియా ప్రతినిధులతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాతర విశేషాలను, భవిష్యత్ ప్రణాళికలను ఆమె పంచుకున్నారు.
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహాజాతర ఈ సారి అత్యంత వైభవంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముగిసిందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. జాతర నిర్వహణ , గుడి పనులు సజావుగా సాగాయని.. భక్తులకు కల్పించిన సౌకర్యాల పట్ల అందరూ సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం క్షేత్రస్థాయిలో ఏర్పాట్లును చూసి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించడం గమనార్హం.
జాతర ప్రారంభ సమయంలో కొంతమంది ఏర్పాట్లపై కావాలనే విష ప్రచారం చేశారని సీతక్క మండిపడ్డారు. ఒక చిన్న దొంగతనం ఘటనను భూతద్దంలో తప్పుడు వార్తలు వ్యాప్తి చేశారని.. వాస్తవానికి భక్తుల రక్షణ కోసం పకడ్బందీ చర్చలు తీసుకున్నామని ఆమె స్పష్టం చేశారు. కేవలం ఒటి రెండు రోజుల్లో తిరుగు జాతర పూర్తి కావడంతో ఈ ఘట్టం ముగియనుంది.
ఈ జాతరలో ఒక విశేష మార్పును గమనించామని మంత్రి తెలిపారు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా హైక్లాస్ ప్రజలు సైతం వేలాదిగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. సుమారు రెండున్నర కోట్ల మంది భక్తులు ఈ వేడుకకు హాజరైనట్లు అంచనా వేస్తున్నాం అని ఆమె పేర్కొన్నారు. అదే విధంగా భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్కలు తలెత్తుకుండా మేడారం చుట్టుపక్కల వెడల్పు చేస్తామని.. వచ్చే జాతర సమయానికి కొత్త రోడ్లను అందుబాటులోకి తెస్తామని మంత్రి హామి ఇచ్చారు. అలాగే.. త్వరలో జరగనున్న పుష్కరాల నిర్వహణపై ములుగు జిల్లా అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేస్తామని సీతక్క వివరించారు.
Also Read: లైంగిక వేధింపుల ఆరోపణలు.. జనసేన ఎమ్మెల్యేను ఉతికి ఆరేసిన త్రీమెన్ కమిటీ!
సచివాలయంలో మంత్రి సీతక్క చిట్ చాట్
మేడారం మహాజాతర విజయవంతమైంది
కొంతమంది కావాలనే జాతరపై, ఏర్పాట్లపై విష ప్రచారం చేశారు
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాతర ప్రశాంతంగా ముగిసింది
ఓ దొంగతనం ఘటనను కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
ఒకట్రెండు రోజుల్లో తిరుగు జాతర జరుగుతుంది… pic.twitter.com/6bgBQhDypp
— BIG TV Breaking News (@bigtvtelugu) February 3, 2026