E-Paper
Advertisement

Minister Jupally: అలాంటి ఛాన్స్ లేదు.. మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు

Minister Jupally: అలాంటి ఛాన్స్ లేదు.. మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు
Advertisement

Minister Jupally: మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలు నీరుగారకుండా యంత్రాంగం పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు పథకంలో 25 వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని తెలిపారు.

రైతు భరోసాలో ఇలాంటి తప్పిదం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని మనసులోని మాట బయటపెట్టారు. హైదరాబాద్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన, రైతు భరోసా కేవలం వ్యవసాయ యోగ్యమైన భూములకే ఇస్తామన్నారు. ఇక రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలులో గ్రామ సభ నిర్ణయాలు కీలకమన్నారు.

Advertisement

ముఖ్యంగా అర్హులందరికీ పథకాలు అందేలా చర్యలు చేపట్టామని వివరించారు. గ్రామ సభల్లో వచ్చిన అభ్యంతరాలను కేవలం 10 రోజుల్లో అధికారులు నివృత్తి చేయాలన్నారు. రేషన్ కార్డుల సంఖ్యను ప్రభుత్వం తగ్గిస్తుందని కేవలం అపోహ మాత్రమేనన్నారు. రేషన్ కార్డు జారీ అనేది నిరంతర ప్రక్రియ అని, అర్హులైన వారందరికీ ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు పథకం కూడా అలాంటిదేనన్నారు.

ఇళ్లు లేని నిరుపేదలు అందరి సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు. కేవలం ఏడాది కాలంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని, గత ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు రూ. 6500 కోట్లు వడ్డీ చెల్లిస్తుందన్నారు. బీఆర్ఎస్ హయంలో కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు జరిగాయన్నారు.

Advertisement

ALSO READ:  తెలంగాణలో ‘పసుపు’ పాలిటిక్స్.. ఎంపీని టార్గెట్ చేసిన కవిత

Related News

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

Big Stories

Advertisement
×