BigTV English
Advertisement

Kishan Reddy on KCR KTR: కేసీఆర్, కేటీఆర్ లకు అర్హత ఉందా? కలెక్టర్ మీద దాడికి పాల్పడతారా? కిషన్ రెడ్డి సీరియస్

Kishan Reddy on KCR KTR: కేసీఆర్, కేటీఆర్ లకు అర్హత ఉందా? కలెక్టర్ మీద దాడికి పాల్పడతారా? కిషన్ రెడ్డి సీరియస్

Kishan Reddy on KCR KTR: బీఆర్ఎస్ పాలనలో సాక్షాత్తు ప్రధాని హైదరాబాద్ వస్తే కనీసం బయటకు రాలేదు మీరు. కలెక్టర్ మీదనే దాడికి పాల్పడడం ముమ్మాటికీ తప్పే. తెలంగాణ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ తో కలిసి కాంగ్రెస్ కూడా వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, ఇది కరెక్ట్ కాదంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.


ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ తాజా రాజకీయ స్థితిగతులపై కిషన్ రెడ్డి సీరియస్ గా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అవినీతి ఎక్కడ జరిగినా విచారణ జరపాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోందని, కాళేశ్వరంపై సీబీఐ విచారణకు తాము ఎప్పుడో డిమాండ్ చేశామన్నారు.

మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ లు ఇచ్చే సర్టిఫికెట్ లు తమ పార్టీకి అవసరం లేదని, బీఆర్ఎస్ హయాంలో సాక్షాత్తు ప్రధానికి సరైన గౌరవం దక్కలేదన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులను ప్రారంభించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు వస్తే కేసీఆర్, కేటీఆర్ లు బయటకు వచ్చి స్వాగతం పలికిన దాఖలాలు లేవన్నారు. అటువంటి నేపథ్యంలో వారికి బీజేపీ గురించి మాట్లాడే అర్హత కూడా లేదని కిషన్ రెడ్డి సీరియస్ గా వ్యాఖ్యానించారు.


ఇక వికారాబాద్ కలెక్టర్ పై దాడికి సంబంధించి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కలెక్టర్ మీద దాడికి పాల్పడడం ముమ్మాటికి తప్పేనన్నారు. కానీ గ్రామస్తులు మీద అక్రమ కేసులు పెట్టడం కూడా సరికాదని, ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకు పోవాలన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో జరిగిన ఘటన కాబట్టి, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తన ప్రజలతో మాట్లాడాలని కిషన్ రెడ్డి సూచించారు.

ఫార్ములా ఏ1 కారు రేస్ కు సంబంధించి కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదుకు ప్రభుత్వం, గవర్నర్ కు ఫైల్ పంపించిన నేపథ్యంలో కిషన్ రెడ్డి స్పందించారు. గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తప్పనిసరిగా లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సి ఉంటుందని కిషన్ రెడ్డి అన్నారు. అంతలోనే తొందరపాటుగా కాంగ్రెస్ పార్టీ కామెంట్స్ చేయడం సరికాదని, అంత మాత్రాన బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనంటూ చెప్పడం అవివేకమన్నారు.

Also Read: Mahesh Kumar Goud: ప్ర‌భుత్వంపై భారీ కుట్ర‌లు.. కేటీఆర్ కు శిక్ష తప్పదు… పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!

అవినీతికి పాల్పడిన ఎవరైనా ఎప్పటికీ తప్పించుకోలేరని, మహారాష్ట్ర, ఝార్ఖండ్ లలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని మంత్రి జోస్యం చెప్పారు. ఒక్క అవినీతి, కుంభకోణం ఆరోపణ లేకుండా బీజేపీ, శివసేన ప్రభుత్వ పాలన సాగిందని మళ్లీ ఈ రెండు రాష్ట్రాల ప్రజలు తమకే పట్టం కట్టనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు.

Related News

Fee Reimbursement: ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నిరసన విరమణ.. రేపటి నుంచి తెరచుకోనున్న కాలేజీలు

FATHI: ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదురు.. వారం తర్వాతే సభకు అనుమతి

Maganti Gopinath: మాగంటి మరణంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే.. విచారణ ప్రారంభిస్తాం: సీఎం రేవంత్

Hyderabad: హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్ దారుణాలు.. ఆసుపత్రి సిబ్బందిపై కత్తులతో దాడి!

Nizamabad Encounter: రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలి.. NHRCని ఆశ్రయించిన రియాజ్ కుటుంబ సభ్యులు

Jubilee Hills By Elections: మాగంటి తల్లి ఆరోపణలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి: మంత్రి సీతక్క

Jubilee Hills: మాగంటి డెత్ మిస్ట‌రీ.. జూబ్లీహిల్స్‌లో కేటీఆర్ చీప్ పాలిటిక్స్.. మరీ ఇంత దిగజారాలా..?

Jubilee Hills bypoll: జూబీహిల్స్‌ బైపోల్‌లో సైలెంట్ వేవ్ రాబోతుంది.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

Big Stories

×