E-Paper
Advertisement

Ponguleti Srinivas Reddy: సంక్షేమానికి కేరాఫ్​ కాంగ్రెస్.. రెండేళ్ల లో మార్పు చూపించాం.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి!

Ponguleti Srinivas Reddy: సంక్షేమానికి కేరాఫ్​ కాంగ్రెస్.. రెండేళ్ల లో మార్పు చూపించాం.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి!
Advertisement

Ponguleti Srinivas Reddy: ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కేవలం రెండేళ్లలో తమ ప్రభుత్వం ప్రత్యేకమైన మార్పు చూపించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. త‌మ ప్ర‌భుత్వం అధికారం చేపట్టే నాటికి ఆర్ధిక పరిస్థితులు సంక్షోభంలో ఉన్నా ఒక్కో మెట్టును సరిదిద్దుతూ సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నామన్నారు.సీఎం రేవంత్ రెడ్డి విజన్ తో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. వ్య‌వ‌సాయం, విద్య‌, వైద్యం, గృహ నిర్మాణం, స‌న్న‌బియ్యం, రేష‌న్ కార్డులు, ఉపాధి క‌ల్ప‌న వ‌ర‌కు అన్ని రంగాల్లో ప్ర‌భుత్వం చేప‌ట్టిన సంస్క‌ర‌ణ‌లు తెలంగాణ‌ను దేశానికి ఆద‌ర్శంగా నిలుపుతున్నాయ‌న్నారు.

ప్ర‌జా సంబంధాల శాఖ పాత్ర అత్యంత కీల‌కం 

ఈ మార్పుల‌ను ప్ర‌జ‌ల‌కు స‌మ‌ర్ధవంతంగా చేర‌వేయ‌డంలో ప్ర‌జా సంబంధాల శాఖ పాత్ర అత్యంత కీల‌కమన్నారు. అందుకే ప్ర‌స్తుత ప‌రిస్ధితుల‌కు అనుగుణంగా సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని విరివిగా వాడుకొని ప్ర‌భుత్వం చేప‌డుతున్న అభివృద్ది సంక్షేమ ప‌ధ‌కాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు వేగ‌వంతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని స‌మాచార శాఖ అధికారుల‌కు సూచించామన్నారు.

Advertisement

Also Read: Ponguleti Srinivas Reddy: రెండేళ్లలోనే తెలంగాణకు కొత్త దిశ: మంత్రి పొంగులేటి

ప్ర‌భుత్వ పాల‌న‌ను రెండేళ్లు పూర్తి

స‌చివాల‌యంలోని త‌న ఛాంబ‌ర్‌లో ఆధునీక‌రించిన స‌మాచార పౌర‌సంబంధాల శాఖ వెబ్‌సైట్‌ను మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌భుత్వ పాల‌న‌ను రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో వసంతంలోకి అడుగుపెట్టామని, రెండేళ్ల కాలం మ‌రీ తక్కువే కానీ ప్రభుత్వం సాధించిన విజయాలు మాత్రం అత్యద్భుతమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనూ, ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

Advertisement

Also Read: CPI And CPM: కామ్రేడ్ లను కలుపుకోవట్లే.. ప్రధాన పార్టీలన్నీ పొత్తులకు ససేమిరా!

Related News

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

Big Stories

Advertisement
×