E-Paper
Advertisement

Uttam Kumar Reddy: పాలమూరు ప్రాజెక్టులకు డెడ్ లైన్.. 2028 డిసెంబర్ కల్లా అన్ని పనులు పూర్తి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy: పాలమూరు ప్రాజెక్టులకు డెడ్ లైన్.. 2028 డిసెంబర్ కల్లా అన్ని పనులు పూర్తి: ఉత్తమ్ కుమార్ రెడ్డి
Advertisement

Uttam Kumar Reddy: హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ జలసౌధలో ఆదివారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై కీలక సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఎక్సైజ్ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి సాగునీటి రంగాన్ని బలోపేతం చేయడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ఖరీఫ్ సీజన్‌లోనే అత్యధికంగా వరి సాగు జరిగిందని, కృష్ణా జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై గత ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి విమర్శించారు. రూ. 55 వేల కోట్ల ప్రాజెక్టులో కేవలం రూ. 27 వేల కోట్లు ఖర్చు చేసి, 90 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పడం హాస్యాస్పదమని మండిపడ్డారు. ప్రాజెక్టు అంచనాలను రూ. 84 వేల కోట్లకు పెంచినప్పటికీ, ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. జూరాల నుంచి శ్రీశైలానికి ప్రాజెక్టును మార్చడం వల్ల జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల భూసేకరణ కోసం జూన్ 2వ తేదీలోపు రూ. 5 వేల కోట్లు ఖర్చు చేస్తామని, నిధులను గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేసి 2028 డిసెంబర్ నాటికి అన్ని పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

వచ్చే మార్చి, ఏప్రిల్ నాటికి ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. గత పదేళ్లుగా పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసినందుకే ప్రజలు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. జూరాల బ్రిడ్జి భద్రత దృష్ట్యా దానిపై వాహనాల రాకపోకలను నిలిపివేస్తామని, ప్రజాభిప్రాయం మేరకే ఈ విషయంలో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. పాలమూరు ప్రజలు కన్న సాగునీటి కలలను తమ ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Read Also: Bhoodan Land Scam: భూదాన్ కమిటీ ముసుగులో.. రూ. 3 కోట్లు వసూళ్ళు చేసిన గ్యాంగ్ అరెస్ట్!

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×