Minor Missing: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ మైనర్ విద్యార్థిని అదృశ్యం ఘటన చోటు చేసుకుంది. బూర్గంపాడు ప్రాంతంలోని కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలలో చదువుతున్న ఇంటర్ విద్యార్థిని అదృష్యమైంది. దీంతో అదృశ్యమైన బాలిక మైనర్గా పోలీసులు గుర్తించారు. అయితే కళ్యాణపురానికి చెందిన ఓ యువకుడు విద్యార్ధినిని తీసుకెళ్లి వివాహం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
Also Read: Suicide Note: నా చావుకు కారణం ప్రధాని మోదీన అంటూ.. సిరిసిల్లలో విషాదం!
బాలిక కనిపించక పోవడంతో ఆందోళనకు గురైన బాలిక కుటుంబ సభ్యులు బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులుఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం యువకుడిని పోలీసుల అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. యువకుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలిక ఆచూకీ కోసం పోలీసుల అన్నీ కోణాల్లో దర్యాప్తుచేసి ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. బాలిక మైనర్ కావడంతో పోలీసులు యువకుడిపై ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.
Also Read: అనారోగ్యంగా ఉన్నా వదలరా.. టెక్ మహీంద్రా కంపెనీ వేధింపులకు రోడ్డెక్కిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని!