Delhi: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు చివరి దశకు చేరుకున్నాయి. కేవలం మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి వున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రి అమిత్ షా హౌస్లోకి ఎందుకు రావలేదని ప్రశ్నించారు.
విపక్షాల ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పకుండా తప్పించుకుంటుందని ఎద్దేవా చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం తనకు కావాల్సిన బిల్లులను పాస్ చేయించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. లోక్సభకు వచ్చి విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్పై అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అసలు విద్యార్థులపై పెల్లెట్ గన్స్ పేల్చమని ఎవరు ఆర్డర్ ఇచ్చారో ఆయన సమాధానం చెప్పాల్సిందేనని కుండబద్దలు కొట్టేశారు. కేంద్రం బిల్లులపై పార్లమెంట్లో చర్చ పెడితే వాటి ఆమోదానికి సంబంధించి ప్రతిపక్షాలుగా నిర్ణయం తీసుకుంటాయని అన్నారు. కేంద్రం ప్రజాస్వామ్యబద్దంగా పార్లమెంట్ను నడపాలన్నారు.
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల లాఠీచార్జ్ అంశంపై సోమవారం పార్లమెంటు ప్రారంభానికి ముందు ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ ఆధ్వర్యంలో ఎంపీలు నిరసన తెలిపారు. పార్లమెంటు ఆవరణంలో అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభకు వచ్చి ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమిత్ షా సభకు హాజరు కావాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సభ్యులు రకరకాల ప్లకార్డులు ప్రదర్శించారు.
Protesting again today at Makar Dwar, Because the @HMOIndia @AmitShah refuses to do his job!
Amit Shah ji is continuously absent from the House while the nation demands answers.
Who ordered the brutal crackdown on students?
Where did the money from the Ayodhya Ram Mandir… pic.twitter.com/qCDPSL6NBU— Kiran Kumar Chamala (@kiran_chamala) August 10, 2026