MP Vaddiraju: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ శ్రీనివాసగిరిలో కొలువైన శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు వెళ్లేందుకు రోడ్డు లేనందున, ఇందుకోసం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పార్టీ ఎంపీల ప్రత్యేక నిధుల నుంచి కోటి 50 లక్షల రూపాయలు అందజేస్తామని హామీనిచ్చారు.ఈ ఆలయంలో ఆదివారం జరిగిన స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Also Read: Moinabad Drug Case: కేటీఆర్ డ్రగ్స్ టెస్టులకు సిద్ధమా? మహేశ్కుమార్ గౌడ్ సవాల్
ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ,ఈ గుడిని సందర్శించే భక్తుల సౌకర్యార్థం తనతో పాటు బీఆర్ఎస్ ఎంపీలు డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి,దీవకొండ దామోదర్ రావుల ప్రత్యేక నిధుల నుంచి 50 లక్షల చొప్పున మొత్తం కోటిన్నర రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు,అవసరమయితే మరో 50 లక్షల రూపాయలు కూడా విడుదల చేయిస్తానని తెలిపారు.ఆలయ కమిటీ ప్రముఖులు, అర్చకులు ఎంపీ రవిచంద్ర,మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు,ఆయన కుమారుడు రాఘవ, బీఆర్ఎస్ నాయకులు దిండిగల రాజేందర్, కాపు సీతామహాలక్ష్మీ తదితరులకు సాదర స్వాగతం పలికారు.అర్చకులు వారికి పూలమాలలు వేసి శాలువాలు,కండువాలతో సత్కరించారు.వేద పండితులు వారికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు పలికారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు రాజు గౌడ్, రంగనాథ్,శాంతి నాయక్ తదితరులు ఉన్నారు.
Also Read: Naga Shourya Mother : గ్యాస్ కొరతతో మూతపడ్డ హోటల్స్.. పొగతో నరకం అంటూ ఉషా పోస్ట్