GHMC: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ లోని 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో గత నెల 11వ తేదీన ఏర్పడిన మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో అంతా బిజీ బిజీ వాతావరణం కన్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 6వ తేదీ నుంచి ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక పేరిట ప్రతి రోజు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ, మూడు కార్పొరేషన్ల కమిషనర్లు హడావుడి చేస్తున్నారు. ముగ్గురు కమిషనర్లు డైలీ మార్నింగ్ నిర్వహిస్తూ పారిశుద్ధ్య, ఈ- వేస్ట్ సేకరణ పనులను ఆకస్మికంగా తనిఖీలు చేస్తుండటంతో మూడు కార్పొరేషన్ల అధికారులు, సిబ్బంది ఉరుకులు, పరుగులు పెడుతున్నారు.
ముఖ్యంగా మూడు కార్పొరేషన్లలో ఇటీవలే కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లలో జీహెచ్ఎంసీ తరహా శానిటేషన్ పనులను గాడీన పెట్టేందుకు కమిషనర్లు సృజన, వినయ్ కృష్ణా రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధి మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా ఏర్పడకముందు ఉదయం పది, పదిన్నర గంటలకు ఆఫీసుకువచ్చి విధులు నిర్వర్తించిన అధికారులు ఇపుడు కమిషనర్ ఎపుడు ఎక్కడికి వస్తారో? ఎక్కడ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారోనన్న భయంతో బిక్కుబిక్కుమంటున్నట్లు తెలిసింది. ముఖ్యంగా సైబరాబాద్ కమిషనర్ సృజన, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకుండా ఒక స్పాట్ కు వచ్చి, శానిటేషన్ పనులను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ ఆ తర్వాత విభాగాల వారీగా పనులను తనిఖీ చేస్తూ, పలు సూచనలు, ఆదేశాలను జారీ చేస్తున్నారు. ముగ్గురు కమిషనర్ల డైలీ షెడ్యూల్ లో మొదటి ప్రాధాన్యత ప్రజాపాలన అనివృద్ది ప్రణాళిక కింద సర్కారు ఇచ్చిన థీమ్ ప్రకారం కార్యక్రమాలు జరుగుతున్నాయా? లేదా? ఒక వేళ జరుగుతుంటే పనులను పూర్తి స్థాయిలో పరిశీలించి, తగిన సూచనలు, ఆదేశాలను జారీ చేస్తున్నారు.
ఉదయం ఆరు గంటలకే ఫీల్డు లెవెల్లో ఉంటున్న కమిషనర్లు మధ్యాహ్నాం వరకు పౌర సేవల నిర్వహణ, పలు అభివృద్ది పనుల తీరును పరిశీలించిన తర్వాత లంచ్ టైమ్ కల్లా వారివారి కార్యాలయాలకు చేరుకుని, ఉదయం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన వివిధ అంశాలకు సంబంధించి విభాగాధిపతులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ(GHMC)లో మొదటి నుంచి కూడా వివిధ విభాగాల వారీగా పౌర, అత్యవసర సేవలందించే యంత్రాంగం యాక్టీవ్ గా ఉన్నా, కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లలో ఇంకా విభాగాల వారీగా సేవలు గాడీన పడినందున, ఈ రెండు కార్పొరేషన్ల కమిషనర్లు ఈ విషయంపై స్పెషల్ గా ఫోకస్ చేస్తున్నట్లు తెలిసింది. శనివారం కూడా సైబరాబాద్, జీహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లు ఈ- వేస్ట్ సేకరణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసి, సిబ్బందికి పలు సూచనలు, సలహాలను అందజేశారు.
మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కూడా డైలీ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పనులను వివిధ విభాగాలకు చెందిన అంశాల వారీగా పరిశీలిస్తూ, ఆ తర్వాత తార్నాకలోని ప్రధాన కార్యాలయంలో సమీక్షలు నిర్వహిస్తూ కింది స్థాయి అధికారులు, సిబ్బందికి తగిన సూచనలు సలహాలు అందజేస్తున్నారు. మూడు కార్పొరేషన్ల కమిషనర్లు డైలీ ఉదయం ఆకస్మిక తనిఖీలు, మధ్యాహ్నాం సమీక్షలు నిర్వహిస్తూనే సందర్శకులకు కూడా సమయం కేటాయించి, వారి నుంచి ఫిర్యాదులను, వినతులను స్వీకరిస్తున్నారు. మూడు కార్పొరేషన్లలో ఒక్క జీహెచ్ఎంసీలోని శనివారం ఒక్క రోజు ఉద్యోగుల గ్రీవియెన్స్ డేను పాటిస్తుండగా, కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లలో ఉద్యోగుల కోసం స్పెషల్ గ్రీవియెన్స్ డే అంటూ ఏమీ మొదలుకాలేదు.
Also Read: Power Demand: విద్యుత్ వినియోగంలో తెలంగాణ ఆల్ టైం రికార్డు..?