E-Paper
Advertisement

Jawaharnagar mayor: జవహర్‌నగర్‌ కార్పొరేషన్.. మేయర్‌పై నెగ్గిన అవిశ్వాసం..

Jawaharnagar mayor: జవహర్‌నగర్‌ కార్పొరేషన్.. మేయర్‌పై నెగ్గిన అవిశ్వాసం..
Advertisement

No Confidence Motion On Jawaharnagar Mayor(Hyderabad latest news): మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌ మేయర్‌ పై అసమ్మతి వర్గం పెట్టిన అవిశ్వాసం తీర్మానం గెలిచింది. దీంతో మేయర్ మేకల కావ్యపై పదవి నుంచి దిగిపోయారు. జవహర్‌ నగర్‌ నగరపాలక సంస్థలో మేయర్‌ సహా 28 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అవిశ్వాసం తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించారు. 20 మంది సభ్యులు మేయర్ మేకల కావ్యకు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో ఆమె పదవిని కోల్పోయారు. అవిశ్వాస తీర్మానం వివరాలను ఆర్డీవో అధికారికంగా ప్రకటించారు.

Read More: మెదక్ మాజీ ఎమ్మెల్యే డ్రైవర్ ఆత్మహత్య.. ఏం జరిగింది?

Advertisement

అవిశ్వాస తీర్మానం సమయంలో జవహర్ నగర్ లో రాజకీయం వేడెక్కింది. అసమ్మతి వర్గం 20 మంది కార్పొరేటర్లు స్పెషల్ వాహనంలో అవిశ్వాస తీర్మాన పరీక్షకు హాజరయ్యారు. కీసర ఆర్డీవో వెంకట ఉపేందర్ అవిశ్వాస తీర్మానంపై‌ ఓటింగ్‌ చేపట్టారు. మొత్తం జవహర్ నగర్ కార్పొరేషన్ లో మొత్తం 28 మంది కార్పొరేట్లు ఉన్నారు. కానీ అనారోగ్యంతో 16వ డివిజన్‌ కార్పొరేటర్‌ మరణించారు. దీంతో మిగిలిన 27 మందితో ఓటింగ్ నిర్వహించారు. అందుకే 20 మంది మేయర్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు. అవిశ్వాస తీర్మానాన్ని బలపర్చారు. 20 మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారని ఆర్డీవో వెంకట ఉపేందర్ ప్రకటించారు.ఈ వివరాలను మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌కు పంపిస్తామని తెలిపారు.

అవిశ్వాస తీర్మానం వేళ జవహర్‌నగర్‌ లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్‌ అమలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

Advertisement

పదవి కోల్పోవడంతో కార్పొరేషన్‌ కార్యాలయం నుంచి మేయర్‌ కావ్య వెళ్లిపోయారు. తనపై కారణంలేకుండానే అవిశ్వాస తీర్మానం పెట్టారని ఆరోపించారు. తమ స్వలాభం కోసం కొందరు కార్పొరేటర్లు ఈ పని చేశారని విమర్శించారు.

Tags

Related News

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×