E-Paper
Advertisement

మేడ్చల్ నడిరోడ్డుపై నోరు తెరిచిన యముడు.. పట్టించుకోని అధికారులు

మేడ్చల్ నడిరోడ్డుపై నోరు తెరిచిన యముడు.. పట్టించుకోని అధికారులు
Advertisement

Open Manhole: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ జీహెచ్ఎంసీ సర్కిల్‌లో ప్రజా సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నా అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నా, రోడ్లు ధ్వంసమవుతున్నా పట్టించుకోని అధికారులు ఇప్పుడు రోడ్డుమధ్య నోరు తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌పైనా కళ్లు మూసుకున్నారు. మేడ్చల్ డివిజన్‌లో అత్యంత రద్దీగా ఉండే హౌజింగ్ బోర్డు కాలనీ రోడ్డులో ఈ ప్రమాదకర మ్యాన్‌హోల్ చాలా రోజులుగా తెరిచే ఉంది.

Also read: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు.. బంగారం లాంటి భవిష్యత్తు

Advertisement

వాహనదారుల ఇబ్బందులు..

ఇదే దారిలో మున్సిపల్ కార్యాలయం, ఏసీపీ కార్యాలయం, మండల పరిషత్, తహసీల్దార్, ఎంఈవో కార్యాలయాలకు అధికారులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నా ఎవరూ స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. రోడ్డుమధ్యలో ఉన్న ఈ ‘మృత్యుగుంత’ కారణంగా వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. ప్రమాదం జరిగాక మేల్కొనే బదులు ఇప్పటికైనా అధికారులు స్పందించి మ్యాన్‌హోల్‌ను మూసివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Also Read: నోరు జారితే రాజకీయ భవిష్యత్తు ఖతం.. కాంగ్రెస్ అధిష్టానం సంచలన నిర్ణయం!

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×