BigTV English
Advertisement

PM Modi Letter to kcr : కేసీఆర్‌కు ప్రధాని మోదీ లేఖ.. ఏం జరిగిందంటే..

PM Modi Letter to kcr : కేసీఆర్‌కు ప్రధాని మోదీ లేఖ.. ఏం జరిగిందంటే..

PM Modi Letter to kcr: మాజీ మంత్రి కేసీఆర్ కు.. ప్రధానీ మోదీ లేఖ రాశారు. గత కొద్ది రోజుల క్రితం కేసీఆర్ సోదరి మృతిచెందడంపై ఆయన సంతాపాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అయితే దీనిపై ప్రధాని మోదీ సంతాపాన్ని లేఖ ద్వారా తెలియజేశారు. కాగా కేసీఆర్ సోదరీ సకలమ్మ ఇటీవల అనారోగ్య కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన సంగతి తెలిసిందే. మాజీ సీఎంకు మొత్తం ఎనిమిది మంది సోదరీమణులు ఉండగా.. వారిలో సకలమ్మ ఐదవ సోదరి. ప్రతి రాఖీ పండుగ నాడు తన సోదరి చేతికి రాఖీ కట్టేదని గుర్తు చేసుకున్నారు.


సోదరి మరణాన్ని చింతిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు, మీకు సానుభూతి తెలుపుతున్నానని పీఎం మోదీ కేసీఆర్‌కు లేఖలో వివరించారు. సోదరి జ్ఞాపకాలు మీ నుంచి ఎప్పటికీ దూరం కావని అన్నారు. ఆ భాధ నుంచి త్వరగా కోలుకోవాలని, ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని మోదీ లేఖలో ఆకాంక్షించారు. ప్రధానీ మోదీ లేఖ రాసిన విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ తమ ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. కేసీఆర్ సోదరీ సకలమ్మ ఇటీవల అనారోగ్య కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన సంగతి తెలిసిందే. మాజీ సీఎంకు మొత్తం ఎనిమిది మంది సోదరీమణులు ఉండగా.. వారిలో సకలమ్మ ఐదవ సోదరి. ఆమె స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పెదిర గ్రామం. ఆమె గత కొంత కాలంగా వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. తీవ్రంగా వ్యాధి క్షీణించడంతో ఇటీవల సికింద్రబాద్ యశోదా ఆస్పత్రిలో చేర్చారు. కొంత కాలంగా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆమె జనవరి 25న మృతి చెందారు. సోదరి మరణ వార్త విని మాజీ సీఎం కేసీఆర్ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రతి రాఖీ పండుగ నాడు తన సోదరి చేతికి రాఖీ కట్టేదని గుర్తు చేసుకున్నారు.


Also Read: ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు.. గడువు కోరిన ఎమ్మెల్యేలు

ఇదిలా ఉంటే. శాసన సభ మండలిలో పార్టీ విప్ లను పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. శాశన సభలో బీఆర్ఎస్ పార్టీ విప్ గా కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యో కేపీ వివేకానంద కేపీ వివేకానంద గౌడ, మండలిలో బీఆర్ఎస్ పార్టీ విప్ గా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ను నియమిస్తూ తాజాగా ఆదేశాలిచ్చారు. కేసీఆర్ ప్రస్తుతం శాసన సభలో బీఆర్ఎస్ పక్ష.. ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. శాసన మండలి మాజీ స్పీకర్ మధుసూధన చారి పక్ష నేతగా వ్యవహరిస్తున్నారు.

మరోవైపు.. సమగ్ర సర్వే వివరాలు కేసీఆర్‌ చెప్పాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. మీడియాతో చిట్‌చాట్ చేసిన సీఎం.. కేసీఆర్‌పై ఫైరయ్యారు. కేసీఆర్‌ కుటుంబం ఏ పని చేసినా చిత్తశుద్ధి లేదన్నారు. రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీసీలు 56 శాతం , 17శాతం ఎస్సీలు ఉన్నారని తెలిపారు. 73.5 శాతం ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. వర్గీకరణ కోసం ఎన్నోఏళ్లుగా మాదిగలు, మాలలు పోరాటం చేస్తున్నారన్నారు

 

Related News

Cyber Crimes: సైబర్ నేరాలు తీవ్ర సామాజిక సమస్య.. ఇది ఉద్యమంగా మారాలి: డీజీపీ శివధర్ రెడ్డి

Cold Wave Alert: తెలంగాణకు తీవ్ర చలి హెచ్చరిక.. సింగిల్ డిజిట్‌కు పడిపోనున్న ఉష్ణోగ్రతలు!

Poll Management: పోల్ మేనేజ్‌మెంట్‌పై పార్టీల ఫోకస్

Thati Venkateswarlu: బీఆర్ఎస్ లో అగ్గి రాజుకుందా ?

Hyderabad: హైదరాబాద్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్.. ఒకరు డాక్టర్

Maganti Gopinath: గోపినాథ్ మరణంపై సీబీఐ విచారణ కోరుతూ గోపినాథ్ బాధితుల డిమాండ్

Jubilee Hills Elections: ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం.. బహిరంగ సభలు, ప్రసంగాలపై నిషేధం

Jubilee Hills Elections: మూడేళ్ల అభివృద్ధికి కాంగ్రెస్‌ను గెలిపించండి.. ఓటర్లకు మంత్రుల పిలుపు

Big Stories

×