E-Paper
Advertisement

PM Modi: జూన్ 4న దేశం గెలుస్తుంది.. వారంతా పారిపోతారు: పీఎం మోదీ

PM Modi: జూన్ 4న దేశం గెలుస్తుంది.. వారంతా పారిపోతారు: పీఎం మోదీ
Advertisement

PM Modi: జూన్ 4 తర్వాత దేశం గెలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలకు ఎందరో బలయ్యారని ఆరోపించారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ ప్రసంగించారు. తనకు హైదరాబాద్ చాలా ప్రత్యేకమైందని మోదీ అన్నారు.

డిజిటల్ రంగంలో భారత దేశం దూసుకుపోతుందని తెలిపారు. భారత దేశ సిద్ధాంతానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పని చేస్తోందని ఆరోపించారు. జూన్ 4 తర్వాత ఆర్టికల్ 370 వ్యతిరేకులు పారిపోతారని అన్నారు. బీజేపీ పాలనలోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మధ్య తరగతి ప్రజల కలలను బీజేపీ సాకారం చేస్తుందని చెప్పారు. గత పదేళ్లలో ఎన్డీఏ ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిందని పేర్కొన్నారు. అంకుర సంస్థల్లో భారత్ ముందుందని తెలిపారు. కాంగ్రెస్ దేశాన్ని విభజించి పాలించేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు.

Advertisement

తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని మోదీ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపే ఉన్నారన్న ఆయన బీజేపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గత కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఎన్నో చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయని అన్నారు. గతంలో ప్రజలు ఎక్కడికి వెళ్లాలన్నా బయపడే పరిస్థితి ఉండేదని తెలిపారు.

Also Read: కేసీఆర్ ధన దాహానికి పాలమూరు బలైంది: సీఎం రేవంత్

Advertisement

భారతీయులపై కాంగ్రెస్ నేతలు జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. శ్రీ రాముడిని పూజించడం దేశ ద్రోహమా అని అన్నారు. వేల సంవత్సరాల భారత సంస్కృతి రక్షణే అసలైన భారత్ సిద్ధాంతం అని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ ముక్తి దివాస్ ను నిర్వహించలేదని అన్నారు. బీజేపీ ప్రభుత్వం సెప్టెంబర్ 17 న అధికారికంగా ముక్తి దివాస్ నిర్వహించిందని గుర్తు చేశారు. మత పరమైన రిజర్వేషన్లను బీజీపీ వ్యతిరేకిస్తుందని తెలిపారు. రాష్ట్రానికి 4 వందేభారత్ రైళ్లు ఇచ్చిందెవరు ? పసుపు బోర్డు ఇచ్చిందెవరు ? గిరిజన విశ్వవిద్యాలయం ఇచ్చిందెవరు ? అని మోదీ ప్రశ్నించారు.

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×