E-Paper
Advertisement

Indiramma Housing Scheme: వారం రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన.. అధికారులతో మంత్రి సమీక్ష.. అదొక్కటే తరువాయి!

Indiramma Housing Scheme: వారం రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన.. అధికారులతో మంత్రి సమీక్ష.. అదొక్కటే తరువాయి!

Indiramma Housing Scheme: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్త చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వం తరపున మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలన్న లక్ష్యంతో తెలంగాణ సర్కార్ ఇందిరమ్మ గృహాలు మంజూరు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ గృహాల లబ్ధిదారుల ఎంపికకు ఇప్పటికే ప్రత్యేక కమిటీని సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాజాగా లబ్దిదారుల ఎంపికకు సంబంధించిన ప్రత్యేకమైన యాప్ ను సైతం రూపొందించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంబంధిత శాఖ అధికారులతో శనివారం సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో యాప్ ఏ విధంగా పనిచేస్తుంది, లబ్ధిదారులను ఏ విధంగా గుర్తిస్తారన్న అంశాలను అధికారులు, మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగేందుకు ప్రత్యేకమైన యాప్ రూపొందించడం జరిగిందన్నారు. రాజకీయ పార్టీలు, ప్రాంతాలనే భేదం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ గృహాలు మంజూరవుతాయని మంత్రి భరోసా కల్పించారు. కాగా యాప్ ను పరిశీలించిన మంత్రి ఒకటి, రెండు మార్పు చేర్పులను సూచించారు. వచ్చే వారంలో యాప్ అందుబాటులోకి రానున్నట్లు మంత్రి ప్రకటించారు.

తెలంగాణ ప్రజలకు సొంతింటి కల నెరవేర్చాలన్న లక్ష్యంతో, ఇందిరమ్మ ఇళ్లను అర్హులకు అందజేస్తున్నట్లు గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ సమయం నుండి అధికారులు, లబ్దిదారులను గుర్తించేందుకు తీసుకోవాల్సిన అన్ని అంశాలను ప్రభుత్వం ముందుంచారు. ఈ పథకాన్ని సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో, సంబంధిత అధికారులు ముమ్మర కసరత్తు చేశారు.

Also Read: Kobbari Bobbatlu: దీపావళికి స్పెషల్ రెసిపీ కొబ్బరి బొబ్బట్టు, ఇది ఎంతో టేస్టీ చేయడం చాలా సులువు

ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, తాజాగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవడం పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం అమలయ్యేందుకు వారం వ్యవధి ఉండగా, అర్హులందరికీ వర్తించేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. కాగా మంత్రివర్గ భేటీ ప్రస్తుతం జరుగుతున్న సంధర్భంగా అభివృద్దికి సంబంధించిన పలు అంశాల గురించి ప్రభుత్వం తాజాగా ప్రకటన చేయనుంది. ఆ ప్రకటనలో కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పూర్తి స్థాయి ప్రకటన కూడా చేసే అవకాశముందని సమాచారం.

Related News

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

Big Stories

×