E-Paper
Advertisement

Nalgonda : ఘోర ప్రమాదం.. ఒకరు సజీవదహనం..

Nalgonda : ఘోర ప్రమాదం.. ఒకరు సజీవదహనం..
Advertisement
Nalgonda Latest news

Nalgonda Latest news(Today news in telangana) :

నార్కట్ పల్లి హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి చీరాలకు వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉండగా ఒక వ్యక్తి సజీవదహనమయ్యారు. నల్గొండ జిల్లాలో మర్రిగూడ బైపాస్ రోడ్డు వద్ధకు రాగానే షార్ట్ సర్కూట్ వల్ల బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ కేకలు వేయగా.. ప్రయాణికులు పరుగులు తీశారు.

స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. కానీ.. అప్పటికే మంటలు తీవ్రం కావడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ప్రమాదంలో సజీవదహనమైన వ్యక్తి వివరాలు సేకరిస్తున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×