Anti Etela: ఎంపీ ఈటల రాజేందర్కు వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీల ఘటన పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పందించారు. బీజేపీ పార్టీ వ్యతిరేకస్తులే ఇలా చేశారని అన్నారు. బీజేపీలో ఐక్యత స్పష్టంగా కనిపిస్తుండడంతో కొంత మంది ఓర్వలేక ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. బీజీపీలో ఉన్నటువంటి ఐక్యతను దెబ్బ తీయండం కోసం కొన్ని పార్టీలు కలిపి చేస్తున్న కుట్ర అని రాచందర్ రావు అన్నారు. పార్టీలో ఉన్న సయానత్వం రాజకీయంగా బీజీపీ పార్టీని కొంతమంది ఎదుర్కోలేక ఈ చిల్లర కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు.
Also read: “నీ ఏడుపే బీజేపీకి శాపం” అంటూ ఈటల రాజేందర్ ఫ్లెక్సీలు కలకలం
ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని అన్నారు. మేడ్చల్ ఉన్న రెండు కమీషనరేట్ లకు దీనిపై ఫిర్యాదు చేస్తామని బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ను లక్ష్యంగా చేసుకుని మేడ్చల్ ఓ ఆర్ ఆర్ సర్వీస్ వద్ద వెలసిన ఫ్లెక్సీలు వెలిసాయి. నీ ఏడుపే బీజేపీకి శాపం అనే శీర్షికతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో రోడ్డుపై ఎర్పాటు చేయండం సంచంలనంగా మారింది. ఈ ఫ్లెక్సీలు పెట్టిన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని పోలీసులకు కంప్లెట్ చేసి, చర్యలు తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు రాంచందర్ రావు అన్నారు.
Also Read: పెద్దపల్లికి గుడ్న్యూస్.. త్వరలోనే అందుబాటులోకి సరికొత్త బస్ డిపో!