E-Paper
Advertisement

Sand Mining: అనుమతుల పేరుతో చీకట్లో అక్రమ తవ్వకాలు.. పట్టించుకోని అధికారులు

Sand Mining: అనుమతుల పేరుతో చీకట్లో అక్రమ తవ్వకాలు.. పట్టించుకోని అధికారులు

Sand Mining: అనుమతి ఉంటే.. రాత్రి మాత్రమే తోవ్వకాలు ఎందుకు…?
-ప్రభుత్వ భూముల్లోనే ఎర్ర మట్టి తోవ్వకాలు
-భూగర్భ వనరులు నాశనం చేస్తున్నా వైనం
-అధికారులు అంతర్గతంగా అక్రమార్కులకు మద్దతు
-చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్.

రంగారెడ్డి బ్యూరో స్వేచ్ఛ: ప్రభుత్వమనే పేరు కనిపిస్తే రాజకీయ నాయకులకు, వ్యాపారస్థులకు లోకువగా కనిపిస్తుంది. అదే సామాన్యుడు ఆ మాట విన్నా, ఆ పదం కనిపించినా గౌరవంగా స్వీకరిస్తారు. కానీ ప్రభుత్వాని చులకన భావంతో, రాజకీయం, ఆర్థికంగా ప్రభావితం చేసి స్వార్థం ప్రయోజనాల కోసం వాడుకుంటారు. వీళ్లకు అదే స్థాయిలో కొంతమంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సహకరిస్తూ ప్రభుత్వ విధానాలకు తూట్లు పొడుస్తున్నారు. ఈ వ్యవహారం రంగారెడ్డి జిల్లాలో ఎప్పుడైనా విచ్చలవిడిగా పని చేస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా వ్యవహారిస్తే భూగర్భ వనరులు, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపాలిటీల్లో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇవేమీ తమకేమి పట్టనట్లు వ్యవహారిచడంలో జిల్లా మొదటి స్థానంలో ఉంటుంది. జిల్లాలో ఒక్క చోట కాదు.. నలుమూలల ప్రభుత్వ స్థలంలో ఎర్ర మట్టి ని అనుమతి లేకుండా తోవ్వకాలు చేస్తున్నారు.

రాత్రి సమయమే అక్రమార్కులకు అనుకూలం..

మున్సిపాలిటీతో పాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ భూముల నుంచి అనుమతులు లేకుండానే మట్టి తరలింపు కొనసాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత శాఖల పర్యవేక్షణ నామమాత్రంగా ఉండటంతో కొందరు వ్యాపారులు స్వేచ్ఛగా తవ్వకాలు చేపట్టి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. దామరగిద్ద రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 153లో ఉన్న ప్రభుత్వ భూమిలో జేసీబీల సహాయంతో పెద్ద ఎత్తున మట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అక్కడ తవ్విన మట్టిని బస్తేపూర్ శివారులో ఇటీవల ఏర్పాటు చేసిన ఫామ్‌ల్యాండ్ వెంచర్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ కార్యకలాపాలు ఎక్కువగా రాత్రి వేళల్లో, ముఖ్యంగా అధికారులు అందుబాటులో ఉండని శని, ఆదివారాల్లో వేగంగా సాగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. నియంత్రణ లేకుండా జరుగుతున్న తవ్వకాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లడంతో పాటు తవ్విన ప్రదేశాల్లో ఏర్పడిన గుంతలు ప్రమాదాలకు దారితీసే పరిస్థితి నెలకొన్నదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే అధికారులు పరిమిత తనిఖీలకు పరిమితమవుతున్నారని, పట్టుబడిన వాహనాలను కూడా రాజకీయ ఒత్తిళ్లతో విడిచిపెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకుని అక్రమంగా మట్టిని తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Also Read: Uttam Kumar Reddy: దేవాదుల ప్రాజెక్టు పూర్తి పై.. క్లారిటీ ఇచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రభుత్వ పనులకే అనుమతి అవసరం

ప్రభుత్వ అవసరాల కోసం మట్టి వినియోగించాలన్నా సంబంధిత శాఖల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలు తమకు వర్తించవన్నట్లుగా కొందరు వ్యవహరిస్తూ మట్టి మాఫియాగా వ్యవస్థీకృతంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

తహసీల్దార్ కృష్ణయ్య

ప్రభుత్వ భూముల నుంచి మట్టి, మోరంను అనుమతి లేకుండా తరలించకుండా కట్టడి చర్యలు చేపడతామని తహసీల్దార్ కృష్ణయ్య తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అక్రమంగా తరలించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

Also Read: Kalvakuntla Kavitha: నాగర్ కర్నూల్ జిల్లాలో.. పసిబిడ్డ మృతి పై స్పందించిన కల్వకుంట్ల కవిత..!

Related News

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

Big Stories

×