Achalasia Treatment: స్వేచ్ఛ బ్యూరో: చిన్నపిల్లల్లో అన్నవాహికకు సంబంధించిన అరుదుగా వచ్చే ఆకలేషియా కార్డియా వ్యాధి బారిన పడ్డ మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వంశీకృష్ణ అనే 12 ఏళ్ల బాలుడికి పర్ ఓరల్ ఎండోస్కోపిక్ మ్యోయోటమి పద్ధతిలో శస్త్ర చికిత్స చేసి కాపాడినట్లు యశోద మలక్ పేట ఆస్పత్రి వైద్యులు డాక్టర్ కిషన్ తెలిపారు.
బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆస్పత్రి వైద్యులు డాక్టర్ కిషన్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ వ్యాధి సాధారణంగా 20 సంవత్సరాల పైబడి 80 ఏళ్ల వయసు వారికి వస్తుందని, 12 ఏళ్ల పిల్లాడికి రావడం ఇదే మొదటిసారి అన్నారు. ఈ వ్యాధి బారిన పడ్డ వారిలో అన్నవాహిక కండరాలు నిష్క్రియగా మారడంతో ఆహారం జీర్ణం కాక, కొద్దిపాటి ఆహారం తీసుకున్న వాంతులు అవుతాయన్నారు. దీంతో పూర్తిగా బరువు కోల్పోయి , తమ దగ్గరికి వచ్చినప్పుడు కేవలం 24 కేజీలు మాత్రమే బరువు ఉన్నట్లు తెలిపారు.
Also read: కీసరలో విషాదం.. భార్య వేధింపులతో డాక్టర్ ఆత్మహత్య
పరీక్షల అనంతరం రోగికి ఆకలేషియా కార్డియా వ్యాధి సోకిందని నిర్ధారించుకున్న వైద్యులు పోయెమ్ అనే పద్ధతిలో ఆపరేషన్ నిర్వహించి మరుసటి రోజు సాధారణ స్థితికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం బాలుడు ఆహారం బాగానే తీసుకుంటున్నాడని, జీర్ణ క్రియ కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. కేవలం 1.60 లక్ష రూపాయల ఆపరేషన్ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
Also read: కొత్త చట్టంతో.. సంబరాలు చేసుకుంటున్న మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ సభ్యులు