BigTV English

REVANTHREDDY : దేశాన్ని కాపాడేందుకే రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్ర: రేవంత్ రెడ్డి

REVANTHREDDY : దేశాన్ని కాపాడేందుకే రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్ర: రేవంత్ రెడ్డి

REVANTHREDDY : దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు మోదీ ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీలో ప్రజలు గొప్ప నాయకుడిని చూస్తున్నారని తెలిపారు. దేశం కోసం ఎలాంటి త్యాగం చేయడానికైనా రాహుల్‌ గాంధీ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజలు వారి సమస్యలను రాహుల్‌ దృష్టికి తీసుకొస్తున్నారని తెలిపారు. భారత్ జోడో యాత్రకు మద్దతుగా అందరూ కదలిరావాలని రేవంత్ పిలుపునిచ్చారు.


80 ఏళ్ల వృద్ధులు కూడా భారత్‌ జోడో యాత్రలో పాల్గొంటున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట సమస్యలను రాహుల్‌ పరిష్కరిస్తారని జనం నమ్ముతున్నారని స్పష్టం చేశారు. ఈ దేశాన్ని కాపాడేందుకే రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారన్నారు. ఈ యాత్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని రేవంత్ అన్నారు. నవంబర్ 7న తెలంగాణలో భారత్ జోడో యాత్ర ముగుస్తుంది. రాహుల్‌కు వీడ్కోలు పలికేందుకు మేనూరులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.


Related News

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Railway Jobs: ఇండియన్ రైల్వేలో 3115 అప్రెంటీస్ ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్, అప్లై చేస్తే మీదే ఉద్యోగం

Tamil Nadu Women Dies: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. చనిపోయిన యువతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

Big Stories

×