BigTV English
Advertisement

REVANTHREDDY : దేశాన్ని కాపాడేందుకే రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్ర: రేవంత్ రెడ్డి

REVANTHREDDY : దేశాన్ని కాపాడేందుకే రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్ర: రేవంత్ రెడ్డి

REVANTHREDDY : దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు మోదీ ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీలో ప్రజలు గొప్ప నాయకుడిని చూస్తున్నారని తెలిపారు. దేశం కోసం ఎలాంటి త్యాగం చేయడానికైనా రాహుల్‌ గాంధీ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజలు వారి సమస్యలను రాహుల్‌ దృష్టికి తీసుకొస్తున్నారని తెలిపారు. భారత్ జోడో యాత్రకు మద్దతుగా అందరూ కదలిరావాలని రేవంత్ పిలుపునిచ్చారు.


80 ఏళ్ల వృద్ధులు కూడా భారత్‌ జోడో యాత్రలో పాల్గొంటున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట సమస్యలను రాహుల్‌ పరిష్కరిస్తారని జనం నమ్ముతున్నారని స్పష్టం చేశారు. ఈ దేశాన్ని కాపాడేందుకే రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారన్నారు. ఈ యాత్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని రేవంత్ అన్నారు. నవంబర్ 7న తెలంగాణలో భారత్ జోడో యాత్ర ముగుస్తుంది. రాహుల్‌కు వీడ్కోలు పలికేందుకు మేనూరులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.


Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×