E-Paper
Advertisement

REVANTHREDDY : దేశాన్ని కాపాడేందుకే రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్ర: రేవంత్ రెడ్డి

REVANTHREDDY : దేశాన్ని కాపాడేందుకే రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్ర: రేవంత్ రెడ్డి
Advertisement

REVANTHREDDY : దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు మోదీ ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీలో ప్రజలు గొప్ప నాయకుడిని చూస్తున్నారని తెలిపారు. దేశం కోసం ఎలాంటి త్యాగం చేయడానికైనా రాహుల్‌ గాంధీ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజలు వారి సమస్యలను రాహుల్‌ దృష్టికి తీసుకొస్తున్నారని తెలిపారు. భారత్ జోడో యాత్రకు మద్దతుగా అందరూ కదలిరావాలని రేవంత్ పిలుపునిచ్చారు.

80 ఏళ్ల వృద్ధులు కూడా భారత్‌ జోడో యాత్రలో పాల్గొంటున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట సమస్యలను రాహుల్‌ పరిష్కరిస్తారని జనం నమ్ముతున్నారని స్పష్టం చేశారు. ఈ దేశాన్ని కాపాడేందుకే రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారన్నారు. ఈ యాత్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని రేవంత్ అన్నారు. నవంబర్ 7న తెలంగాణలో భారత్ జోడో యాత్ర ముగుస్తుంది. రాహుల్‌కు వీడ్కోలు పలికేందుకు మేనూరులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×