E-Paper
Advertisement

Zurich Airport : జ్యురిచ్‌కు చేరుకున్న రేవంత్ టీమ్.. ఎయిర్‌పోర్టులో రాయబారి-తెలుగు ప్రజల ఘనస్వాగతం

Zurich Airport : జ్యురిచ్‌కు చేరుకున్న రేవంత్ టీమ్.. ఎయిర్‌పోర్టులో రాయబారి-తెలుగు ప్రజల ఘనస్వాగతం

Zurich Airport: దావోస్‌ వేదికగా మంగళవారం నుంచి ప్రపంచ ఆర్థికవేత్తల సదస్సు-2026 మొదలు కానుంది. ఇప్పటికే ప్రపంచంలోని వ్యాపారవేత్తలు, దేశంలొని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడికి చేరుకున్నారు. స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్ సిటీకి రేవంత్ టీమ్ చేరుకుంది. అక్కడ వారికి ప్రవాస తెలంగాణ వాసులు ఘన స్వాగతం పలికారు.

జ్యురిచ్‌కు చేరుకున్న రేవంత్ టీమ్

స్విట్జర్లాండ్ లోని జ్యురిచ్ సిటీకి చేరుకుంది రేవంత్ టీమ్. జ్యురిచ్ ఎయిర్‌పోర్టులో సీఎం రేవంత్‌రెడ్డికి భారత రాయబారి మృదుల్​ కుమార్​ తోపాటు ప్రవాస తెలంగాణ వాసులు ఘనస్వాగతం పలికారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంట మంత్రి పొంగులేటి, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. ఒకరోజు ముందుగానే దావోస్ చేరుకున్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఇవాళ పారిశ్రామికవేత్తలతో సమావేశం ఉంటుంది.

తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు రేవంత్ టీమ్ దావోస్‌కు వెళ్లింది. అక్కడ తెలంగాణ విజన్ రైజింగ్-2047 పేరిట గూగుల్, సేల్స్ ఫోర్స్, యూనిలీవర్, హనీవెల్, నోవార్టిస్, టాటా గ్రూప్, డీపీ వరల్డ్, ఇన్ఫోసిస్, సిస్కో కంపెనీల అధినేతలతో సీఎం రేవంత్‌రెడ్డి విడివిడిగా భేటీ కానున్నారు. పలు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంటారు.

ఎయిర్‌పోర్టులో రాయబారి-తెలుగు ప్రజల ఘనస్వాగతం

తెలంగాణలో ప్రస్తుతమున్న పరిశ్రమల విస్తరణ, ఐటీ, ఏఐ, లైఫ్ సైనెన్స్ వంటి రంగాల్లో పెట్టుబడులపై ప్రధానంగా ఫోకస్ చేయనున్నారు. ఈ పర్యటన ద్వారా పెట్టుబడులకు గమ్యస్థానంగా మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. వివిధ రంగాల అభివృద్ధికి అనుకూలతలను దావోస్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

అంతకుముందు స్విట్జర్లాండ్‌లోని భారత రాయబారి మృదుల్​ కుమార్​ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఆ తర్వాత పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉండే కంపెనీల గురించి ఆరా తీశారు. 2024లో కేవలం 40 వేల కోట్ల పెట్టుబడులపై తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోగా, గతేడాది లక్షా 78 లక్షల కోట్లు పెట్టుబడులపై ఒప్పందాలు జరిగాయి. ఈసారి అంతకంటే ఎక్కువ ఒప్పందాలు జరిగే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది.

ALSO READ:  ఫోన్ ట్యాపింగ్ కేసు.. కాసేపట్లో పార్టీ ఆఫీసుకు హరీష్‌రావు

 

Related News

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Big Stories

×