School Bus: స్వేచ్చ బ్యూరో: మేడ్చల్లోని ఎల్లంపేట మున్సిపల్ సమీపంలోని జాతీయ రహదారి-44పై శనివారం ఉదయం స్కూల్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
Also Read: అల్లూరి జిల్లా స్కూల్లో మత్తు మాస్టర్.. ఫుల్లుగా తాగోచ్చి బెంచీపై పడిపోయిన టీచర్!
కళాకళ్ నుంచి మేడ్చల్ వైపు వెళ్తున్న సెయింట్ క్లారెట్ స్కూల్ బస్సు (ఏపీ 29 వీ 9430) ఎల్లంపేట సమీపానికి చేరుకోగానే రోడ్డుపక్కన నిలిపి ఉన్న గూడ్స్ లారీ (ఎంహెచ్ 18 ఏఏ 9630) వెనుక భాగాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోక్షిత్ రాజ్ పాల్ పంటి గాయానికి గురికాగా, లక్ష్మీ ప్రసన్నకు గడ్డం వద్ద స్వల్ప గాయం అయింది. హాసిని, హన్వికలకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదంలో బస్సు, లారీ దెబ్బతిన్నాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also read: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్.. వెలుగులోకి మరో 2 కొత్త డిమాండ్లు!