Teacher Suspended: ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా చింతపల్లి మండలంలోని పినపాడు గిరిజన పాఠశాలలో PTM ప్రోగ్రాంకు ఫుల్లుగా ఓ టీచర్ రమణ తాగి వచ్చాడు. అంతే కాకుండా మత్తులో ఉండి బెంచీపైనే పడిపోయాడు. దీంతో ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.
టీచర్ ప్రవర్తన పట్ల పిల్లల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడు ఇలా ఉంటే విద్యార్థుల చదువు పరిస్థితి ఏంటని కొంత మంది ఫైర్ అయ్యారు. తాగి పాఠశాలకు వచ్చిన టీచర్పై ప్రభుత్వ వేటు వేసింది. మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్కు మద్యం మత్తులో హాజరైన ఉపాధ్యాయుడిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
Also Read: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై.. మంత్రి పొన్నం షాకింగ్ కామెంట్స్!
బెంచ్పై పడిపోయిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యాశాఖ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అధికారులు ఎంక్వైరీ నివేదిక ఆధారంగా ఉపాధ్యాయుడు కొరబు వెంకట రమణను ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ సస్పెండ్ చేసింది. విధుల్లో నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యాన్ని ఏమాత్రం ఉపేక్షించబోమని అధికారులు స్పష్టం చేసారు.
స్కూలుకు ఫుల్లుగా తాగొచ్చిన టీచర్
AP: అల్లూరి జిల్లా చింతపల్లి మండలంలోని పినపాడు గిరిజన పాఠశాలలో PTM ప్రోగ్రాంకు ఫుల్లుగా తాగొచ్చిన టీచర్ రమణ మత్తులో బెంచీపైనే పడిపోయాడు. ఈ వీడియో వైరల్ కాగా, టీచర్ ప్రవర్తన పట్ల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడు ఇలా ఉంటే… pic.twitter.com/SkFrTzJo3i
— ChotaNews App (@ChotaNewsApp) July 25, 2026
Also Read: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. సంచలన పోస్ట్ చేసిన జ్యోతిక!