Defection Case: స్వేచ్చ బ్యూరో: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(MLA Danam Nagender), స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (MLA Kadiyam Srihari) పై బుధవారం తుది తీర్పు వెలువడనుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపై ఏం నిర్ణయం ప్రకటిస్తారనేది ఆసక్తి కరంగా మారింది. ఇప్పటికే ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మందిలో 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా పేర్కొంటూ తీర్పు ఇచ్చారు.
Also Read: Farmers: రైతులకు భారీ శుభవార్త.. ఈ 13న అకౌంట్లలో డబ్బులు జమ
అయితే దానం నాగేందర్ పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ బీ ఫాంపై పోటీ చేశారు. కాంగ్రెస్ ప్రచార కార్యక్రమాల్లో సైతం పాల్గొన్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తూ అందుకు సంబంధించిన వివరాలను స్పీకర్ కు అందజేసింది. అదే విధంగా ఎమ్మెల్యే కడియం సైతం తనకూతురుకు కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ ఇప్పించుకొని గెలిపించుకున్నారు. ఎన్నికల్లో ప్రచారంసైతం పాల్గొన్న వీడియోలను సైతం స్పీకర్ కు బీఆర్ఎస్ అందజేసింది. ఇరువురి వాదనలు విన్న స్పీకర్ తీర్పును రిజర్వు చేశారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 12లోగా నిర్ణయంను స్పీకర్ ప్రకటించాల్సి ఉండగా తీర్పును ప్రకటిస్తారని సమాచారం. ఇద్దరిపై తీర్పు ప్రకటిస్తారా? లేదా? అనేది చూడాలి. తీర్పును మళ్లీ రిజర్వుచేస్తారా? అనేది ఆసక్తి కరంగా మారింది.
Also Read: Indigo CEO Resign: ఇండిగో సీఈవో ఎల్బర్స్ రాజీనామా.. కారణం అదేనా?