E-Paper
Advertisement

Defection Case: నేడు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై తుది తీర్పు.. నేటితో వారికి తెరపడేనా..!

Defection Case: నేడు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై తుది తీర్పు.. నేటితో వారికి తెరపడేనా..!
Advertisement

Defection Case: స్వేచ్చ బ్యూరో: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(MLA Danam Nagender), స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (MLA Kadiyam Srihari) పై బుధవారం తుది తీర్పు వెలువడనుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపై ఏం నిర్ణయం ప్రకటిస్తారనేది ఆసక్తి కరంగా మారింది. ఇప్పటికే ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మందిలో 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా పేర్కొంటూ తీర్పు ఇచ్చారు.

Also Read: Farmers: రైతులకు భారీ శుభవార్త.. ఈ 13న అకౌంట్లలో డబ్బులు జమ

కోర్టు మార్గదర్శకాల ప్రకారం..

Advertisement

అయితే దానం నాగేందర్ పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ బీ ఫాంపై పోటీ చేశారు. కాంగ్రెస్ ప్రచార కార్యక్రమాల్లో సైతం పాల్గొన్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తూ అందుకు సంబంధించిన వివరాలను స్పీకర్ కు అందజేసింది. అదే విధంగా ఎమ్మెల్యే కడియం సైతం తనకూతురుకు కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ ఇప్పించుకొని గెలిపించుకున్నారు. ఎన్నికల్లో ప్రచారంసైతం పాల్గొన్న వీడియోలను సైతం స్పీకర్ కు బీఆర్ఎస్ అందజేసింది. ఇరువురి వాదనలు విన్న స్పీకర్ తీర్పును రిజర్వు చేశారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 12లోగా నిర్ణయంను స్పీకర్ ప్రకటించాల్సి ఉండగా తీర్పును ప్రకటిస్తారని సమాచారం. ఇద్దరిపై తీర్పు ప్రకటిస్తారా? లేదా? అనేది చూడాలి. తీర్పును మళ్లీ రిజర్వుచేస్తారా? అనేది ఆసక్తి కరంగా మారింది.

Also Read: Indigo CEO Resign: ఇండిగో సీఈవో ఎల్బర్స్ రాజీనామా.. కారణం అదేనా?

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×