Jupally Krishna Rao: స్వేచ్ఛ బ్యూరో: నాగర్కర్నూల్ జిల్లాలో చారిత్రాత్మక పుణ్యక్షేత్రమైన సిర్సనగండ్లలో శ్రీరామ నవమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయ అర్చకులు మంత్రితో పాటు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రభుత్వం తరపున మంత్రి స్వామివారికి పట్టువస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. అనంతరంస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Also read: Water Crisis: నిప్పులు చెరుగుతున్న భానుడు.. కంటికి కనిపించని చలివేంద్రాలు
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. సిర్సనగండ్ల క్షేత్రానికి ఉన్న విశిష్టతను కాపాడుతూ, భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ పుణ్యక్షేత్రాన్ని పర్యాటక పరంగా కూడా అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని రామాలయం వద్ద కార్యక్రమంలో ఎంఎల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పూజల్లో పాల్గొన్నారు.
Also Read: Sand Mafia: ముడుపుల మత్తులో మైనింగ్, పోలీస్ శాఖలు.. గద్వాల్లో జోరుగా ఇసుక దందా..!