Speaker Gaddam: నేను జనరల్గా బీఆర్ఎస్కి మైక్ ఇవ్వొద్దు కానీ ప్రజాస్వామ్య పద్దతిలో నేను సభని నడిపిస్తున్నానని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. నిన్న జరిగిన దానికి ఈ రోజు సభలో హరీష్, బీఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్తారు అనుకున్నాను. కానీ వారి మాటలతో నేను మనస్తపనికి గురైయ్యానని స్పీకర్ అన్నారు. నేను ఎప్పుడు మీడియా ముందుకు రాను. ఇది మొదటి సారి అలాగే కోపానికి కూడా రావడం కుడా మొదటిసారి అని స్పీకర్ అన్నారు. నాకు సబితా కి ఒక సమయంలో జంగ్ నడుస్తుండే కానీ ఎప్పుడు ఎవరు ఒక మాట అనుకోలేదుని అన్నారు.
ఈ రోజు ఛైర్లో కూర్చోవాలంటే బాధగా ఉంది. ప్యానల్ స్పీకర్ని పెట్టి సభ నడిపించాలని కోరానని అన్నారు. హరీష్ రావు అలా మాట్లాడడం సరికాదు. సీనియర్ నాయకులు, మంత్రిగా పని చేసిన అనుభవం మీకు ఉందని, గేట్ -3 నుండి అంత స్పీకర్ పరిధిలోకే వస్తుందని అన్నారు. బహుశా వారికి తెలియదు ఏమో.. 5 సార్లు ఎమ్మెల్యేగా నేను పోటీ చేశాను. 3 ఏళ్లనుండి స్పీకర్గా ఉన్నానని, నేనే నేరుగా చర్యలు తీసుకోవచ్చని వారిపై కోమటిరెడ్డి, సంపత్ని వాళ్ళు అలాగే చేశారని గుర్తు చేశారు. కానీ మేము అలా చేయలేదు కదా.. ప్రజాస్వామ్య పద్దతిలో చేస్తున్నాముని గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వీడియో లో కేటీఆర్, కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే నవీన్ రెడ్డి, తాత మధు దొబ్బిన్నట్లు, తిట్టిన్నట్లు కనిపిస్తోందని అన్నారు.
Also read: ఓటీటీలోకి సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. అఫీషియల్ అనౌన్స్మెంట్ వైరల్!
సభలో రేషలుషన్ చేసి మండలికి పంపిస్తాము. టీ షర్ట్స్ పై స్లొగన్స్ ఉన్నాయి అందుకే లోపటికి అనుమతించలేదని స్పీకర్ తెలిపారు. స్లొగన్స్ లేని వారు సభలోకి వెళ్ళొచని పోలీసులు చెప్పారు కానీ వారు రాలేదు. ఇదంతా కేసీఆర్ హయాంలో పెట్టిన రూల్స్.. మేము పెట్టింది కాదని అన్నారు. 2014 కంటే ముందున్న రూల్స్ తీసేసి.. కేసీఆర్ కొత్త రూల్స్ పెట్టారు. గవర్నమెంట్ డిసైడ్ చేసిందని అన్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వచ్చి విచారం వ్యక్తం చేయాలనీ నేను ప్రతి సమావేశానికి ముందు ఫోన్ చేసి రావాలని కోరుతానని తెలిపారు. ఈ సారి కూడా ఫోన్ చేసి రావాలని కోరానని, నా ఆరోగ్యం సహకరిస్తే వస్తానని చెప్పారని కేసీఆన్ అన్నారని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు.
Also Read: నాగార్జునసాగర్ టూర్ ఇక మరింత థ్రిల్లింగ్.. సరికొత్త అడ్వెంచర్ స్పాట్ గా ఎత్తిపోతల జలపాతం!