Cabinet Meeting: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 4వ తేదీన (సోమవారం)జరగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని ఆరో అంతస్తులో ఉన్న కేబినెట్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 3:00 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రధానం గా తుమ్మిడిహెట్టి బ్యారేజీపై కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించి శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని తరలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించేందుకు నాలుగు మార్గాలు ప్రతిపాదనలో ఉన్నాయి. వీటిపై కేబినెట్ చర్చించి, నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
Also read: తక్కువ బడ్జెట్లో బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ కావాలా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే
ఇక ఉద్యోగులు, ఫించనర్ల సమస్యలు, డిమాండ్లపై మంత్రి మండలి చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఉద్యోగులు, పింఛనర్ల పెండింగ్ బిల్లులు 100 రోజుల్లో క్లియర్ చేయాలని భావిస్తున్న ప్రభుత్వం, అందుకు సంబంధించిన కార్యాచరణపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనుంది. పెండింగ్ డీఏలు, ప్రభుత్వం నగదు రహిత చికిత్సలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, కొత్త ఆసరా ఫించన్లు, తెలంగాణ ఉద్యమకారుల కోసం కార్యక్రమాలు, ఇందిరమ్మ బీమా పథకం తదితర అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
Also read: ఆపరేషన్తో ప్రాణం.. చదువుతో విజయం.. కేటీఆర్ అండతో శరణ్య సాధించిన అద్భుతం!