Mehidy Hasan Miraz On Ind Vs Ban: బంగ్లాదేశ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మళ్లీ ద్వైపాక్షిక సిరీస్ నిర్వహించేందుకు రెండు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలు తెగిపోగా… మళ్లీ ఇప్పుడు, రెండు క్రికెట్ బోర్డులు ఒకటి అవుతున్నాయి. త్వరలోనే రెండు జట్ల మధ్య రెండు సిరీస్ కూడా జరగబోతున్నాయి. ఈ క్రమంలో మాజీ ఇండియన్ క్రికెటర్లు, కొంతమంది రాజకీయ నాయకులు బంగ్లాదేశ్ తో జరిగే సిరీస్ లను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హర్భజన్ సింగ్ కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు.
హిందువులను హింసిస్తున్న బంగ్లాదేశ్ తో క్రికెట్ ఆడడం అవసరమా ? అని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు మెహిదీ హసన్ మిరాజ్ (Mehidy Hasan Miraz) షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. బంగ్లాదేశ్ నాయకులు తమ రాజకీయాల కోసం మమ్మల్ని బలి చేశారని.. టీమిండియాతో ఆడాలని మాకు ఎంతో ఆశగా ఉందని పేర్కొన్నారు. బంగ్లా కంటే ఇండియానే సేఫెస్ట్ కంట్రీ అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. దయచేసి ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సిరీస్ జరిగేలా చూడాలని రిక్వెస్ట్ చేశారు. దీంతో బంగ్లా క్రికెటర్ మెహదీ హసన్ మిరాజ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Ishant Sharma On MS Dhoni : ధోని మాములోడు కాదు భయ్యా…కోహ్లీని, నన్ను బండబూతులు తిట్టాడు
త్వరలో బంగ్లాదేశ్ వర్సెస్ టీమిండియా మధ్య టి20, వన్డే సిరీస్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్ క్రికెటర్ మెహదీ హసన్ మిరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సమయంలో… ఇండియాలో పర్యటించకుండా కొన్ని రాజకీయ శక్తులు తమను అడ్డుకున్నాయని మండిపడ్డారు. ఇండియాను బూచిగా చూపించి… తమను తప్పుదారి పట్టించారని ఫైర్ అయ్యారు. పాకిస్తాన్ కుక్కలు చెప్పిన మాటలను.. బంగ్లాదేశ్ రాజకీయ నాయకులు విన్నారని ఆగ్రహించారు. పాకిస్తాన్ కుక్కల మాటలు విని, ఇండియాను తాము కూడా అవమానించామని ఎమోషనల్ అయ్యారు. కానీ ఇప్పుడు తప్పు తెలుసుకున్నామని వివరించారు.
ప్రతి ఒక్క క్రికెటర్ కు టి20 ప్రపంచ కప్ ఆడాలని ఉంటుందని.. కానీ బంగ్లాదేశ్ మాత్రం అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకుందని ఫైర్ అయ్యారు. ఇండియాలో మ్యాచ్ లు ఆడాలంటే బంగ్లాదేశ్ క్రికెటర్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారని వివరించారు. 2026 టి20 ప్రపంచ కప్ బహిష్కరణ అనేది ఓ రాజకీయ అంశమని.. అనవసరంగా బంగ్లాదేశ్ క్రికెటర్లను ఇండియన్స్ తప్పుగా ఊహించుకోకూడదని కోరారు. మీ ఇండియా అంటే తమకు ఎంతో ఇష్టమని… తమతో దయచేసి సిరీస్ లు ఆడాలని కోరారు.
టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య సెప్టెంబర్ మాసంలో వైట్ బాల్ క్రికెట్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టోర్నమెంట్లో భాగంగా మొత్తం మూడు టి20 లు, 3 వన్డేలు జరగనున్నాయి. ఆగస్టు 28వ తేదీన బంగ్లాదేశ్ కు ఇండియా కూడా వెళ్లనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఈ సిరీస్ షురూ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.